Bollywood : స్టార్ కమెడియన్ ఆస్తి వేలం వేస్తున్న బ్యాంక్..

Bollywood : బాలీవుడ్ స్టార్ కమెడియన్లలో రాజ్ పాల్ యాదవ్ కూడా ఒకరు. బాలీవుడ్ లో రెండు దశాబ్దాలుగా పాపులర్ కమెడియన్లలో ఒకరిగా కొనసాగుతూ, ఆడియన్స్ ని అలరిస్తున్న రాజ్ పాల్ యాదవ్ ఎక్కువగా రామ్ గోపాల్ వర్మ హిందీ సినిమాలతో ఫేమస్ అయ్యాడు. ఇదిలా ఉండగా రాజ్ పాల్ యాదవ్ నటుడిగానే కాకుండా దర్శకుడిగా, మరియు నిర్మాతగా కూడా పలు సినిమాలను చేశాడు. స్టార్ కమెడియన్ గా ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్స్ కూడా అందుకున్న ఈ కమెడియన్ నుండి తాజాగా ఊహించని వార్త వస్తుంది. ఎన్నో సినిమాల్లో తన కామెడీతో అలరించిన ఈ స్టార్‌ కమెడియన్‌ ఆస్తిని బ్యాంకు వారు జప్తు చేయడం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.

Bollywood comedian RajPal Yadav's property has been seized by bank officials

కమెడియన్ ఆస్తిని వేలం వేస్తున్న బ్యాంకు..

తాజాగా అందిన సమాచారం ప్రకారం ముంబై సెంట్రల్ బ్యాంక్‌ అధికారులు రాజ్ పాల్‌ యాదవ్‌ ఆస్తిని జప్తు చేశారట. ఆ మధ్య ఓం పురి ప్రధాన పాత్రలో రాజ్ పాల్ యాదవ్‌ (Raj pal yadav) ఒక సినిమాను నిర్మించాడు. అంతే కాదు దానికి దర్శకత్వం కూడా వహించాడు. అయితే ఆ సినిమా కోసం ముంబై సెంట్రల్ బ్యాంక్ నుంచి రాజ్ పాల్ పెద్ద మొత్తంలో రుణం తీసుకున్నాడట. కానీ ఆ లోన్ ని చెల్లించడంలో విఫలం అయ్యాడని, అందుకే రాజ్ పాల్ యాదవ్‌ తనఖా పెట్టిన ఆస్తిని బ్యాంక్ అధికారులు జప్తు చేసి, వేలం వేస్తున్నారట. తాను గతంలో తీసుకున్న అప్పుకు పెద్ద మొత్తంలో వడ్డీ పెరిగి, ఇప్పుడు చెల్లించలేని పరిస్థితికి రాజ్ పాల్‌ యాదవ్ వచ్చాడు. ఆ సినిమా నిరాశ పరచడంతో కనీసం బ్యాంక్ లో తీసుకున్న లోన్ కూడా తీర్చలేకపోయాడట.

- Advertisement -

ఆస్తి కంటే ఎక్కువ తీసుకున్నాడట..

అయితే కమెడియన్ రాజ్ పాల్‌ యాదవ్‌ తాను అప్పుడు చేతులు తీర్చలేనని చేతులెత్తేశాడట. అందుకే అతని ఆస్తిని వేలం వేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే బాలీవుడ్‌ (Bollywood) మీడియా కథనాల ప్రకారం, రాజ్ పాల్ యాదవ్ తీసుకున్న అప్పు తన ఆస్తి కంటే ఎక్కువట. అందువల్ల రాజ్ పాల్ యాదవ్ తనఖా పెట్టిన ఆస్తిని కాకుండా, ఇతర ఆస్తుల్ని కూడా జప్తు చేసే అవకాశం ఉందట. ఇప్పటికీ పలు సినిమాల్లో నటిస్తున్న రాజ్ పాల్ యాదవ్ ఆ అప్పు తీర్చడం కోసమే నానా తంటాలు పడుతున్నాడట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు