ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సెలెబ్రిటీలపై తన నీచపు రాతలతో విషం వెల్లగక్కుతూ తరచూ వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. గతంలో చాలా మంది సెలెబ్రిటీల గురించి నీచపు వాగుడు వాగి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. బాలీవుడ్ సెలెబ్రిటీల గురించి మాత్రమే కాకుండా టాలీవుడ్ స్టార్లు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, సమంత వంటి వారిపై కూడా అలాంటి వ్యాఖ్యలే చేశాడు.
ఇతని వ్యాఖ్యలు తరచూ చూసి విసుగెత్తిన సెలెబ్రిటీలు ఇతన్ని పట్టించుకోవటం మానేశారు. ఈ క్రమంలో ఇటీవల అక్కినేని అఖిల్, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా పై ఉమైర్ చేసిన ట్వీట్ తీవ్ర దుమారాన్ని రేపింది. ఏజెంట్ సినిమా యూరోప్ లో శహోటింగ్ జరుగుతున్న సమయంలో హీరో అఖిల్ ఉర్వశిని లైంగికంగా వేధించాడని, అఖిల్ వేధింపులు తాళలేని ఊర్వశి అఖిల్ మెచ్యూరిటీ లేని నటుడని అభిప్రాయపడిందని అంటూ ట్వీట్ చేసాడు ఈ క్రిటిక్. ఇందుకు స్పందించిన ఊర్వశి రౌతేలా ఉమైర్ పై పరువు నష్టం దావా వేసింది.
ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఉమైర్ కి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు ఊర్వశి ముందుకు రావటంపై ఫ్యాన్స్, నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉమైర్ నోటికి తాళం పడ్డట్టే అని అంటున్నారు నెటిజన్స్. ఊర్వశి వేసిన పరువు నష్టం దవాపై కోర్టు సానుకూలంగా స్పందించి ఉమైర్ భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా కట్టడి చేస్తే, సెలెబ్రిటీల వ్యక్తిగత అంశాల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారికి హెచ్చరిక అవుతుంది.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News