Vishwambhara : విశ్వంభర కోసం భారీ సెట్.. వేరే ప్రపంచం చూపిస్తారట?

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న “విశ్వంభర” షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. సినిమా అనౌన్స్ అయ్యాక సెట్స్ పైకి రావడం కాస్త ఆలస్యమైనా, ఒక్కసారి మొదలుపెట్టాక నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఆ మధ్య కొన్ని లీక్స్ కూడా సినిమాపై అంచనాలని పెంచేసాయి. యూవీ క్రియేషన్స్ వారు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక చాలా కాలం త‌ర్వాత చిరంజీవి న‌టిస్తోన్న సోషియో ఫాంట‌సీ చిత్ర‌మిది. ఇప్ప‌టికే షూటింగ్ కూడా ముగింపు ద‌శ‌కు చేరుకుంటుంది. ఈ నేప‌థ్యంలో సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా అది వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా(Vishwambhara)లో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ త్రిష మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో బ‌ల‌మైన సిస్ట‌ర్ సెంటిమెంట్ ఉండబోతుందని సమాచారం. ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు చెల్లెళ్ళు ఉంటారని ఇదివరకే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పైగా ఆ సెంటిమెంటే సినిమాలో హైలైట్ కాబోతుంద‌ని స‌మాచారం.

విశ్వంభర కోసం భారీ సెట్…

ఇక విశ్వంభర సినిమా యూనిట్ నుండి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం విశ్వంభర సినిమాలోని ఓ కీలక యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ మెగాస్టార్ చిరంజీవి త్రిష పాత్రలతోనే స్టార్ట్ అవుతుందని టాక్. జూన్ రెండో వారం నుంచి ఈ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారని టాక్. అలాగే ఇదే చోట మరో భారీ సెట్ కూడా వేస్తారని సమాచారం. అయితే ఆ సెట్ వేరే ప్రపంచం లా ఉండేలా డిజైన్ చేసారని సమాచారం. ఇక ఈ సినిమా సోషియో ఫాంటసీ సినిమాగా రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్ప్పుడు వేయ బోయే సెట్ దేవతలకి సంబంధించి, ఇంద్రలోకం, లేదా గాంధర్వ లోకం అలాంటి ప్రపంచలకి సంబంధించి సెట్ ఏమైనా వేయొచ్చని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తున్నారని తెలుస్తుంది.

Chiranjeevi Vishwambhara Movie Latest update

- Advertisement -

సిస్టర్ సెంటిమెంట్ హైలెట్..

కాగా ఈ సినిమాలో మెగాస్టార్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలని అనుకుంటున్నారో ఆయన పాత్ర అలాగే ఉంటుందట. అలాగే, ఈ చిత్రంలో అద్భుతమైన ఫాంటసీ డ్రామా కూడా ఉంటుందట. ఇక ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కుతుందట. ఇప్ప‌టికే చెల్లెళ్లు పాత్ర‌ల‌కు సంబంధించి కొంత మంది యువ నాయిక‌ల్ని తీసుకున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి కి చెల్లెళ్ళగా సురభి, మీనాక్షి చౌదరి, ఇషా చావ్లా, ఆషిక రంగనాథ్ నటిస్తున్నారని సమాచారం. ఇక షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉన్నా నెల‌ల స‌మ‌యం సీజీకే ప‌డుతుంది. అందుకే చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ విశ్వంభర సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 10, 2025న విడుదల కాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు