Committee Kurrollu: ముగ్గురు యంగ్ హీరోస్ వచ్చిన కాపాడలేకపోవచ్చు

Committee Kurrollu: ప్రస్తుతం రాబోతున్న చిన్న సినిమాల్లో కొంతమేరకు మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసిన సినిమా కమిటీ కుర్రాళ్ళు. ఈ సినిమాతో చాలామంది యూట్యూబర్స్ వెండి తెరపై కనిపించనున్నారు. ఈ సినిమాను మెగా ప్రిన్సెస్ నిహారిక నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు టీజర్, ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో అనుదీప్ దేవ్ సంగీత దర్శకుడుగా మారాడు. యాదు వంశీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఆగస్టు 9న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.

ఇక రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ హాజరయ్యారు. వీరితోపాటు యంగ్ హీరో అడవి శేష్ కూడా హాజరయ్యారు. ఈ సినిమా ఈవెంట్లో శేషు మాట్లాడుతూ ఈ సినిమాలో నటించిన 11 మంది హీరోలు నలుగురు హీరోయిన్లలో సినిమాలో కొంతమందికి ఛాన్స్ కూడా ఇస్తాను అంటూ చెప్పాడు. ఇకపోతే కమిటీ కుర్రాళ్ళు సినిమా గురించి ఒక టాక్ వినిపిస్తోంది. సినిమా ఊహించిన స్థాయిలో లేదని ఇది ఒక యూట్యూబ్ స్పేస్ కి సరిపడా కంటెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం ముగ్గురు హీరోలు వచ్చి ప్రమోట్ చేసినా కూడా కాపాడలేకపోవచ్చు అంటూ తెలుస్తుంది. ఏదేమైనా సినిమా రిలీజ్ తర్వాత అసలు టాక్ బయటకు రానుంది.

కాగా ఈ రోజుల్లో ఒక మంచి సినిమాను తీయడం కంటే ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం అసలైన టాస్క్. ఎంత మంచి సినిమా తీసిన కూడా దానికి సరైన ప్రజాదరణ దక్కకపోతే ఆ సినిమా అలానే మిగిలిపోతుంది. ఇలా ఎన్నో సినిమాలు థియేటర్లో మిస్సయిన వాళ్లు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేశారు. కొన్ని సినిమాలు ఓటీటీ లో చూసిన తర్వాత ఇంత మంచి సినిమాను థియేటర్లో మిస్ అయ్యామా అని అభిప్రాయం కలుగుతుంది. కమిటీ కుర్రాళ్ళ విషయానికి వస్తే ఈ సినిమాలో చాలా నోస్ట్రాలజియా మూమెంట్స్ ఉన్నాయి. బహుశా అవి కొంతమేరకు వర్కౌట్ మంచి టాక్ వస్తే సినిమాకి మంచి కలెక్షన్స్ రావడం ఖాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు