Sankranthi Race: పొంగల్ బరిలో మరో సినిమా.. కానీ థియేటర్ల పరిస్థితి?

టాలీవుడ్ లో రాబోయే 2024 సంక్రాంతికి భారీ సినిమాల పోటీ ఉందన్న విషయం తెలిసిందే. కేవలం తెలుగు నుండే అరడజను సినిమాలు పోటీ పడుతున్న నేపథ్యంలో కోలీవుడ్ నుండి మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అయితే అఫిషియల్ గా రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్న సినిమాల్లో గుంటూరు కారం, సైన్ధవ్, ఈగల్ సినిమాలు నిలిచాయి. మిగతా సినిమాలు ఇంకా కన్ఫర్మేషన్ చెయ్యలేదు.

ఇదిలా ఉండగా కోలీవుడ్ నుండి ఇప్పటివరకు రెండు సినిమాలు రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్నాయి. వాటిలో శివ కార్తికేయన్ అయలాన్, రజిని “లాల్ సలాం” తో పాటు ఇప్పుడు మరో క్రేజీ సినిమా పొంగల్ కే రెడీ అయింది. కోలీవుడ్ స్టార్ ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా “కెప్టెన్ మిల్లర్”. ఈ సినిమాని కూడా పొంగల్ కి రిలీజ్ చేస్తున్నామంటూ మూవీ మేకర్స్ ప్రకటించడం జరిగింది.

అయితే ఇటు తెలుగులోనూ, అటు తమిళ్ లో పోటీలో ఉన్న సినిమాల సంఖ్య లెక్కేస్తే పదికి పైగానే ఉంటుంది. తెలుగులో ఖచ్చితంగా మూడు సినిమాలైనా పోస్ట్ పోన్ కాక తప్పని పరిస్థితి. ఇక తెలుగు సినిమాలకే థియేటర్లు లేవు అంటే కోలీవుడ్ మూవీస్ కూడా డబ్బింగ్ అయ్యి రిలీజ్ కి రెడీ అవుతుండడం హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

ఇన్ని సినిమాల్లో సగం సినిమాలైనా పోటీ నుండి తప్పుకుంటే మంచిదని ట్రేడ్ విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఉన్న థియేటర్లలో అన్నిటికి పంచడం అంటే సాధ్యం కాదు. రిలీజ్ కాబోయే సినిమాల్లో అన్ని భారీ అంచనాలున్న సినిమాలే. ఎవరికీ నష్టం జరగకూడదు అన్న ఉద్దేశం ఉంటె కొంతమంది ముందే తప్పుకుంటే మంచిదని సోషల్ మీడియా లో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి మూవీ మేకర్స్ ఇది ఎంత వరకు ఆలోచిస్తారో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు