Mahesh Babu: స్క్రిప్ట్ పూర్తి కాకముందే రాజమౌళి విలన్ ని డిసైడ్ చేశాడా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో సినిమా అనౌన్స్ అయినా సంగతి తెలిసిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న మహేష్, ఆ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో హాలీవుడ్ నటీనటులతో భారీ బడ్జెట్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు రాజమౌళి. ఈ క్రేజీ కాంబినేషన్ కోసం మహేష్ అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకుడు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందన్న వార్తలు రావటంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

ఇంకా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కానీ ఈ సినిమా విషయంలో ఒక ఇంట్రస్టింగ్ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ముఖ్యంగా నార్త్ లో ఈ రూమర్ బలంగా వినిపిస్తోంది. అదేంటంటే, ఈ సినిమా విలన్ గా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటిస్తున్నాడని ఆ రూమర్స్ సారాంశం. ఈ సినిమాలో అమీర్ ఖాన్ విలన్ అన్న అంశం కనీసం దర్శకుడు రాజమౌళికి అయినా తెలుసా అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
ఈ రూమర్స్ నిజం అయ్యే అవకాశం దాదాపు లేదు అన్నది చాలా మంది అభిప్రాయం.

ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావటానికి సుమారు 4నెలల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. కాబట్టి ఈ సినిమా గురించి అఫీషియల్ అప్డేట్ రావాలంటే స్క్రిప్ట్ పూర్తయ్యేంతవరకు ఆగాల్సిందే అన్నమాట. ప్రస్తుతం మహేష్ మహేష్ నటిస్తున్న గుంటూరు కారం సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది సినిమా యూనిట్. ఈ నేపథ్యంలో మహేష్, రాజమౌళి కాంబినేషన్లో సినిమా పూర్తయ్యి రిలీజ్ అవ్వాలంటే కనీసం ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు