Telugu Actress: యాంకర్ రష్మీకి ఆ పొలిటికల్ లీడర్ అన్ని లక్షల బంగారాన్ని గిఫ్ట్ చేశారా..?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు బుల్లితెరపై రష్మీకి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే. నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ జబర్దస్త్ షో తో యాంకర్ గా మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మీ. వచ్చిరాని తెలుగులో ముద్దు ముద్దు మాటలతో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ ముద్దుగుమ్మకు వెండితెర అంతగా కలిసి రాకపోవడంతో బుల్లితెరపై తన సత్తాను చాటుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా రష్మీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. రష్మీకి ఓ రాజకీయ నాయకుడు ఏకంగా ఆరు లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను గిఫ్ట్ చేశారట. రష్మీ తాజాగా ఓ పాపులర్ జువెలరీ మాల్ కి వెళ్లి అక్కడ దాదాపు 6 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను కొనుగోలు చేసిందట. కానీ బిల్లు మాత్రం కట్టలేదట. ఆ బిల్లును ప్రముఖ రాజకీయ నాయకుడు సదరు జ్యూవెలరీ వాళ్లకి ట్రాన్స్ఫర్ చేశారట.

దీంతో అక్కడ ఉండే వాళ్లందరూ షాక్ అయ్యారట. ఆయన ఓ బడా రాజకీయ నాయకుడు కావడంతో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆ రాజకీయ నాయకుడు ఎవరు.? అతనికి రష్మీకి ఏం సంబంధం..? ఇదంతా నిజమా..? లేక ఎవరైనా రష్మీపై పుట్టించిన పుకార్లా..? అన్నది తెలియాలంటే ఆమె స్పందించాల్సిందే..!

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు