Tollywood Actor : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకున్న వారే ఉన్నారు. ఇండస్ట్రీలో ప్రేమలు పెళ్లిళ్లు, విడాకులు కామన్.. అయితే కొంతమంది హీరో హీరోయిన్లకు మొదట పెళ్లిళ్లు జరిగినా కూడా సినిమాల్లోకి వచ్చాక మళ్లీ ప్రేమలో పడి మొదటి భార్యాభర్తలకు విడాకులు ఇచ్చేసి మళ్లీ పెళ్లి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇలాంటి వారిలో కృష్ణ విజయనిర్మల, అక్కినేని నాగార్జున అమల వంటి వాళ్ళు ఉన్నారు.. అమలను నాగార్జున కన్నా ముందు విలన్ ఒకరు ప్రేమించారని సమాచారం.. ఆ వ్యక్తి ఎవరో ఎందుకు డ్రాప్ అయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం..
అమల కేరీర్ మొదట్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉండేది.. నాగార్జునతో సినిమాలు చేసినప్పుడు ప్రేమలో పడింది.. ఇద్దరు ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.. ఇక అమల స్టార్ హీరోయిన్ అయినప్పటికీ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండి ఇంటిపట్టునే ఉంటూ కుటుంబ బాధ్యతలను చక్కగా నెరవేర్చింది. అయితే అలాంటి అక్కినేని అమలను మొదట్లో ఓ స్టార్ నటుడు గాఢంగా ప్రేమించాడట.. ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట.. అయితే ఈ విషయం అమలకు తెలియదు. కానీ ఆయన మాత్రం వన్ సైడ్ లవ్ చేశారట.
అమలను గాడంగా ప్రేమించిన నటుడు ఎవరో కాదు స్టార్ విలన్ గా గతంలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రఘువరన్.. నాగార్జున కంటే ముందే అమలను ప్రేమించాడట. కానీ ఆ తర్వాత నాగార్జున అమల ఇద్దరు ప్రేమలో ఉన్నారన్న సంగతి తెలిసి తన ప్రేమను తనలోనే దాచుకున్నాడు.. ఆమెను పెళ్లి చేసుకోక పోయినప్పటికి ఆమె మీద ఉన్న ప్రేమతో ఆమె దక్కలేదు అన్న బాధలో మద్యానికి బానిసయ్యాడు .. హీరోయిన్ రోహిణిని పెళ్లి చేసుకున్నాడు.. వీరికి ఒకబాబు కూడా ఉన్నాడు.. బాబు చిన్న వయస్సులోనే రఘువరన్ మరణించాడు.. ప్రస్తుతం అన్నీ తల్లి చూసుకుంటుంది.. రోహిణి సినిమాల్లో బిజీగా ఉంది… అమ్మ పాత్రల్లో మెప్పిస్తూ వస్తుంది..