Tollywood Heros: తెలుగు ఇండస్ట్రీలోని హీరోలు సినిమాలతో అభిమానులను సంపాదించుకోవడం మాత్రమే కాదు.. కొన్ని విపత్కర పరిస్థితులలో తమ అభిమానులకు ప్రజలకు అండగా ఉంటున్నారు. వారు చేస్తున్న సాయం చూసి ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. మొన్న కేరళలో సంభవించిన భారీ వరదలకు ఎందరో ప్రాణాలను కోల్పోయారు. కొందరు కుటుంబ సభ్యులను పోగొట్టుకొని నిరాశ్రయులు అయ్యారు. దాంతో చలించిన తెలుగు హీరోలు ఒకరి తర్వాత మరొకరు భారీ విరాళాన్ని ప్రకటించారు. పెద్ద మనసు చాటుకున్నారు. అయితే వేరే రాష్ట్రంలో వరదలు వస్తే ముందుకు వచ్చిన హీరోలు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో వరదలు ముంచేత్తుతున్న సంగతి తెలిసిందే.. అయితే తెలుగు ప్రజలకు సాయం ప్రకటించడానికి ముందుకు రాలేదు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది.
ఏపీ, తెలంగాణ తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం వరుణుడి దెబ్బకు అతలాకుతలం అవుతున్నాయి. వరదల ధాటికి ఊర్లన్నీ నీటమునిగాయి. ఇంట్లోకి నీరు వచ్చి చేరింది. వాహనాలు కొట్టుకుపోయాయి. ఎంతో మందికి నిద్ర, ఆహారం కరవయ్యాయి. ప్రభుత్వం నిరవధికంగా సహాయక చర్యలు అందిస్తూనే ఉంది. ఈ వరదల వల్ల ఏపీలోని విజయవాడ, గుంటూరు ప్రాంతాలు ఎక్కువగా నష్టపోయాయి. ఇక ఈ వరదల ప్రభావం వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా ఎంతో నష్టం వాటిల్లుతుంది. అందుకోసం టాలీవుడ్ నుంచి సెలెబ్రిటీలు ముందుకు వచ్చి ప్రభుత్వాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. ఇప్పటివరకు ఎన్టీఆర్ (Ntr) రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు ఇచ్చారు.
టాలీవుడ్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ (Aswneedutt ) కల్కి టీం నుంచి రేపటి కోసం అంటూ ఏపీ ప్రభుత్వానికి మాత్రమే రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఆయ్ (Aay) టీంకు ఈ వారం వచ్చే కలెక్షన్లలో 25 శాతం షేర్ని ప్రభుత్వానికి ఇస్తామన్నట్టుగా ప్రకటించారు. విశ్వక్ సేన్ ( Viswak Sen ) తెలంగాణ, ఏపీ ప్రభుత్వానికి రూ. 5 లక్షల చొప్పున విరాళాన్ని ఇచ్చాడు.. అయితే కేరళ కోసం ముందుకు వచ్చిన ప్రభాస్ (Prabhas), అల్లు అర్జున్ (Allu Arjun) మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన ఇవ్వకపోవడం పై తెలుగు అభిమానులు మాత్రం కోపంగా ఉన్నారు. ఎందుకు వీళ్లు మౌనంగా ఉన్నారనే దానిపై ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. మరి దీనిపై ఇప్పటికే పెద్ద చర్చలు మొదలయ్యాయి. మరి దీనిపై ఇద్దరు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.