Chiranjeevi : అల్లు అరవింద్ , మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు ఒకప్పుడు బాగా ఉండేవారు.. అల్లు వల్ల చిరంజీవికి వరస అవకాశాలు వచ్చేవట.. వీరిద్దరూ బావ బామ్మర్దులు గా కాకుండా స్నేహితులుగా ఉండే వారట.. చిరంజీవి తన టాలెంట్ తోఅభిమానుల మనసును చూరగొన్నాడు. దాంతో చిరు సినిమాలకు మార్కెట్ లో డిమాండ్ కూడా పెరిగిందని తెలుస్తుంది.. స్టార్గా ఎదిగాక గీతా ఆర్ట్స్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందనేది కూడా అంతే వాస్తవం. శుభలేఖ, యమకింకరుడు, హీరో, విజేత, ఆరాధన, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు , రౌడీ అల్లుడు, ఎస్పీ పరశురామ్ వంటి హిట్ సినిమాలను చేసాడు.. అయితే చిరంజీవి చేసిన ఒకపనికి అల్లు అరవింద్ కు కుట్లు కూడా పడ్డాయని ఓ వార్త వినిపిస్తుంది..
అల్లు అరవింద్ కు బావ అంటే ఎంత అభిమానమో చాలా సందర్భాల్లో మనం చూసే ఉంటాం.. ఎవరు ఎమన్నా సహించేవాడు కాదు.. అదే అతనికి కుట్లు పడేలా చేసింది.. ఈ నేపథ్యంలో ఒకసారి చిరంజీవిని ఓ వ్యక్తి అసభ్యంగా దుర్భాషలాడితే అతనిని చితకబాదారట అల్లు అరవింద్. ఇటీవల ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..గతంలో వాళ్లకు దేవి శ్రీదేవి అనే థియేటర్ ఉన్నట్లు చెప్పాడు.. ఆ థియేటర్ ను రవిరాజా పినిశెట్టి, సత్యరెడ్డి, లోక్ సింగ్, సాగర్, భానుచందర్ లు చూసుకునేవారని చెప్పారు.
అయితే ఓ పెద్ద మనిషి మాములుగా మంచి వాడే కానీ తాగితే మాత్రం ఎదవని అల్లు చెప్పాడు. ఆయన తాగి థియేటర్లో సినిమా చూసి బయటకు వచ్చినపుడు చిరంజీవి గురించి అసభ్యంగా మాట్లాడాడని , అది విని కోపంతో రగిపోయినట్లు అల్లు చెప్పారు. అంతేకాదు సున్నితంగా మందలించినా వినకపోవడంతో తాను థియేటర్ మేనేజర్ని పిలిచి కళ్లజోడు ఇచ్చి.. ఆ పెద్దమనిషి కాలర్ పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చి కొట్టానని చెప్పారు. ఈ గొడవలో భాగంగా తనని బాగా గాయాలు అయ్యాయని , 13 కుట్లు కూడా పడినట్లు చెప్పారు.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..