Guntur Kaaram: ఎట్టకేలకు పూజా హెగ్డే కి తెలుగు సినిమా ఛాన్స్..!

ఒక లైలా సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అనతి కాలంలోనే డీజే, అలవైకుంఠపురంలో వంటి వరుస బ్లాక్ బస్టర్స్ అందుకొని టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది పూజా హెగ్డే. అయితే, ఈ మధ్య సరైన హిట్ లేకపోవటంతో తెలుగులో ఆఫర్లు సన్నగిల్లాయి. పైగా బాలీవుడ్ ఆఫర్ల మీద మోజుతో టాలీవుడ్ కి దూరమైన పూజకి అక్కడ కూడా సరైన హిట్ లేక పెద్దగా ఆఫర్లు రాలేదు. ఇదిలా ఉండగా తెలుగులో త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం, హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల నుండి హీరోయిన్ గా పూజని తొలగించటంతో అమ్మడి కెరీర్ అగాధంలో పడ్డట్టయింది.

అసలే సరైన ఆఫర్లు లేక సతమతం అవుతున్న పూజ చేతిలో ఉన్న రెండు క్రేజీ ఆఫర్స్ కూడా చేజారటంతో నెట్టింట ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో పూజకి మరో తెలుగు సినిమా ఆఫర్ వచ్చిందని వార్తలొస్తున్నాయి. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, డైరెక్టర్ సంపత్ నంది డైరెక్షన్లో రూపొందనున్న సినిమా కోసం పూజా హెగ్డేను హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారని, ఈ ఆఫర్ కి పూజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం అందుతోంది.

ఈ నేపథ్యంలో మామ పవన్ కళ్యాణ్ తో మిస్ అయిన ఆఫర్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో అందుకుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉండగా, ఈ సినిమా ద్వారా అయినా సరైన హిట్ అందుకొని పూజా హెగ్డేకి తెలుగులో వరుస ఆఫర్లు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు