Guntur Kaaram : గ్లామర్ టచ్ కోసమే ఇద్దరు హీరోయిన్లు… నో ఇంపార్టెన్స్?

Guntur Kaaram :  సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న పెద్ద సినిమాలలో “గుంటూరు కారం” ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ కాగా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్లో హీరోయిన్లను చూపించిన విధానం కొత్త అనుమానాలకు తెర తీస్తోంది. త్రివిక్రమ్ కేవలం గ్లామర్ టచ్ కోసమే ఈ ఇద్దరు హీరోయిన్లను తీసుకున్నాడా? అసలు ఈ హీరోయిన్ల క్యారెక్టర్లకు సినిమాలో కొంచమైనా ప్రాధాన్యత ఉంటుందా? అనే కొత్త డౌట్స్ పుట్టుకొస్తున్నాయి.

“గుంటూరు కారం” మూవీలో యంగ్ బ్యూటీలు శ్రీలీల, మీనాక్షి చౌదరి.. మహేష్ బాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి హీరోతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసే అవకాశం రావడం నిజానికి అదృష్టమని చెప్పాలి. కానీ కేవలం ఇలాంటి అవకాశం కోసం ఎలాంటి ప్రాధాన్యత లేని పాత్రలు చేయడం మాత్రం హీరోయిన్ల కెరీర్ ను రిస్క్ లో పడేసే అవకాశం ఉంటుంది. తాజాగా శ్రీలీల, మీనాక్షి చౌదరిలను టీజర్ లో చూస్తుంటే వాళ్లు కూడా ఇదే బాటలో నడుస్తున్నట్టుగా అనిపిస్తోంది. వీళ్ళిద్దరితో మహేష్ బాబు జోడి స్క్రీన్ పై ఫ్రెష్ గా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా “గుంటూరు కారం” ట్రైలర్ లో కేవలం రొమాంటిక్ ఎలిమెంట్స్ కోసమే శ్రీలీలను వాడుకున్నారు. ఇక మీనాక్షి చౌదరి అయితే మెరుపుతీగలా తలుక్కున మెరిసి వెళ్లిపోయింది. ఇది ఆమె అభిమానులను నిరాశకు గురి చేసింది.

అయితే మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న శ్రీలీలకు ట్రైలర్లో బాగానే స్కోప్ ఇచ్చారు. అయినప్పటికీ ఆమె ఈ సినిమాలో కేవలం డ్యాన్స్, గ్లామర్ కే పరిమితం అవుతుందని, ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు అని అనిపిస్తోంది. అదే సమయంలో మీనాక్షి చౌదరి మెయిన్ హీరోయిన్ కానప్పటికీ త్రివిక్రమ్ ఆమెకు ఓ ముఖ్యమైన పాత్ర ఇచ్చి ఉంటాడని అనుకుంటున్నారు. కానీ ప్రమోషన్స్ లో, అలాగే ట్రైలర్ లో ఆమెకు ఇచ్చిన ఇంపార్టెన్స్ చూస్తే ఈ మూవీలో మీనాక్షి పాత్ర పరిధి చాలా తక్కువగా ఉంటుందనీ అనిపిస్తోంది.

- Advertisement -

మరి ఈమె పాత్రకైనా ప్రాధాన్యత ఉంటుందా అంటే అనుమానమే. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో హీరోయిన్లు కేవలం గ్లామర్ కి మాత్రమే పరిమితం అవుతారు. మరి ఈ హీరోయిన్లు ఇద్దరి పరిస్థితి ఏంటో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. కాగా ముందుగా మీనాక్షి చేస్తున్న పాత్రకు శ్రీలీలను, మెయిన్ హీరోయిన్ గా పూజ హెగ్డేను అనుకున్నారు. కానీ ఆ తర్వాత పూజ హెగ్డే ఈ మూవీ నుంచి తప్పుకోవడంతో మెయిన్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ శ్రీలీలకి దక్కింది. ఆమె చేయాల్సిన పాత్రను మీనాక్షి చౌదరికి ఆఫర్ చేశారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు