Guntur Kaaram: మళ్లీ వాయిదా – అసలేం జరుగుతోంది..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సువర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో గుంటూరు కారం సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తి పెంచింది. డిఫరెంట్ డైలాగ్ మాడ్యులేషన్ తో మాస్ లుక్ తో మెహెష్ బాబు కనిపిస్తున్న నేపథ్యంలో బ్లాక్ బస్టర్ ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు మహేష్ అభిమానులు. ఇదిలా ఉండగా షూటింగ్ స్టార్ట్ అయిన నాటి నుండి చాలా సార్లు వాయిదా పడుతూ వస్తోంది. మహేష్ బాబు వెకేషన్ కి వెళ్ళటం, త్రివిక్రమ్ కి కొన్ని కమిట్మెంట్స్ ఉండటం వంటి కారణాలతో వాయిదా పడిన షూటింగ్ జూన్ 12న మొదలు కానుందని అనౌన్స్ చేశారు. మళ్లీ ఏమైందో తెలీదు కానీ, ఈ రోజు స్టార్ట్ రావాల్సిన షెడ్యూల్ ని జూన్ 20కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

ఈ షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయాలని ప్లాన్ చేసిన సినిమా యూనిట్ వాయిదా వేసి 16 నుండి ఫైట్ రిహార్సల్స్ ప్లాన్ చేసిందని సమాచారం అందుతోంది. అసలే గురూజీ పవన్ కళ్యాణ్ సినిమాల మీద ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తూ మహేష్ సినిమాని నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహేష్ ఫ్యాన్స్ ఈ వార్త ఆందోళనకు గురి చేస్తోంది.

త్రివిక్రమ్, మహేష్ ల కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావటంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యం షూటింగ్ త్వరగా పూర్తి చేసుకొని అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యి మహేష్ బాబుకి సంక్రాంతి బ్లాక్ బస్టర్ దక్కుతుందా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు