Tollywood : కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తూ హనుమాన్ నిర్మాతల భారీ సినిమా?

Tollywood : టాలీవుడ్ లో ఈ ఏడాది ఊహించని భారీ విజయం సాధించిన సినిమా ఏది అంటే అది “హనుమాన్” సినిమా అనే చెప్పాలి. పెద్దగా అంచనాలు లేకుండా సంక్రాంతి కి వచ్చిన ఈ సినిమా అనూహ్య విజయం సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఏకంగా 300 కోట్ల వసూళ్లు సాధించి నిర్మాతలకు, బయ్యర్లకు అందరికి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా తరవాత దర్శకుడు ప్రశాంత్ వర్మ బడా హీరోలతో రెండు భారీ ప్రాజెక్టులు ఒకే చేసాడు. ఇకపోతే ఆ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉండగా లేటెస్ట్ గా హనుమాన్ నిర్మాతల నుండి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది.

Hanuman Film Producer Pan India Cinema with story based on Ramayana

ఆ జోనర్ లో హనుమాన్ నిర్మాత భారీ సినిమా…

లేటెస్ట్ గా హనుమాన్ మూవీ నిర్మించిన నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ వారు ఒక భారీ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నారట. నిర్మాత నిరంజన్ రెడ్డి ఒక రాజేస్జ్ అనే సినిమాటోగ్రాఫర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారట. అల్రెడీ కథా చర్చలు కూడా జరిగిపోగా, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సినిమా బడ్జెట్టే వంద కోట్ల రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అంతే కాదు ఈ సినిమా నేపథ్యం రామాయణం కి సంబంధించి ఉంటుందట. మరి సినిమా సోషియో ఫాంటసీ జోనర్ లో ఉంటుందా.. లేక మరింకేదైనా కాన్సెప్టా తెలీదు గాని, ఈ సినిమాపై నెటిజన్లు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

మరి రాముడుఎవరు?

ఇక హనుమాన్ నిర్మాతలు నిర్మించబోతున్న ఈ భారీ సినిమా రామాయణం అంశాలను టచ్ చేస్తూ నిర్మిస్తున్నారని వార్తలు వస్తుండడంతో రాముడిగా ఏ హీరోని చూపిస్తారా అని కూడా చర్చలు మొదలయ్యాయి. అయితే వస్తున్న కథనాల ప్రకారం టాలీవుడ్ కి చెందిన ఓ మీడియం రేంజ్ హీరోని, లేదా ఇతర భాషల హీరోని తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో కనుక ఎవరైనా ఒప్పుకుంటే సినిమా రేంజ్ చాలా పెరిగిపోతుందని అంటున్నారు నెటిజన్లు. మరి ఈ వార్తలపై నిజమెంతో తెలియాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు