మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన సినిమా విరూపాక్ష. ఇటీవల విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని తేజ్ కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించి దూసుకుపోతుంది. విడుదలకు ముందే పాజిటివ్ బజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా అదే స్పీడ్ తో బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాలో తేజ్, సంయుక్త నటనకు మంచి ప్రశంసలు అందుతున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో సంయుక్త పర్ఫామెన్స్ కి ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. తేజ్ కెరీర్లో నటించిన మొదటి హారర్ జానర్ చిత్రం కావటంతో అతని కెరీర్లో ఈ సినిమా ప్రత్యేక స్థానంలో నిలుస్తుందని చెప్పాలి.
ఈ సినిమా యూనిట్ ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో తేజ్ విరూపాక్ష పార్ట్ 2 ఉంటుందంటూ క్లారిటీ ఇచ్చారు. దర్శకుడు మారుతీ సినిమా యూనిట్ ని ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో తేజ్ ఆయనతో పార్ట్ 2 గురించి చెప్పారు. దీంతో సోషల్ మీడియాలో విరూపాక్ష పార్ట్2 పై చర్చ మొదలైంది. మూఢనమ్మకాలపై రూపొందిన ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా సినిమాకి ప్లస్ అయ్యిందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో విరూపాక్ష సీక్వెల్ కోసం దర్శకుడు కార్తీక్ ఎలాంటి కథను సిద్ధం చేస్తాడు, సినిమా షూట్ ఎప్పుడు మొదలవుతుంది అన్న చర్చ మొదలెట్టారు నెటిజన్స్. విరూపాక్ష పుట్టించిన హీట్ చల్లారక ముందే పార్ట్2 అంటూ సంకేతాలివ్వటం సినిమాకు మరింత బజ్ క్రియేట్ చేసింది.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News