Silambarasan : కోలీవుడ్ స్టార్ హీరో శింబు తనదైన సినిమాలతో దూసుకుపోతున్నాడు. కొన్నాళ్ళు వరుస ప్లాపులతో డీలా పడ్డ హీరో మనాడు బ్లాక్ బస్టర్ తో కం బ్యాక్ ఇవ్వగా, రీసెంట్ గా “పాతు థలా” తో మరో సక్సెస్ అందుకుని జోరుమీదున్నాడు. ఇక ప్రస్తుతం కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న థగ్ లైఫ్ లో సెకండ్ లీడ్ రోల్ చేస్తున్నాడు. ఇక ఆ వెంటనే కమల్ హాసన్ నిర్మాణం లో ఓ సినిమా చేయనున్నాడు. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను తీసుకోనున్నారట చిత్ర యూనిట్. అది కూడా బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను దించుతున్నారట. వాళ్లెవరో కాదు ఒకరు అందాల తార జాన్వీ కపూర్. మరొకరు హాట్ బ్యూటీ కియారా అద్వానీ. ఈ ఇద్దరిలో ఆల్రెడీ కియారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఇయర్ జాన్వీ కపూర్ కూడా హీరోయిన్ గా తెలుగులో దేవర తో ఎంట్రీ ఇస్తుంది. ఇప్పుడు కోలీవుడ్ లో కూడా ఎంట్రీ కి రెడీ అయ్యారు.
శింబు సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ…
ఇక కియారా, జాన్వీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయ్యింది. అయితే ఇప్పటి వరకు అక్కడ హిట్ ను సొంతం చేసుకోలేకపోయింది. కానీ హిట్ పడకున్నా కూడా జాన్వీ కపూర్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. ఇప్పుడు టాలీవుడ్ లో జాన్వీ కపూర్ ప్రస్తుతం ఎన్టీఆర్ కి జోడీగా దేవర సినిమాలో నటిస్తూనే, మరో వైపు రామ్ చరణ్ కి జోడీగా బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాను చేస్తుంది. ఇక మరో వైపు రామ్ చరణ్ కి జోడీగా “గేమ్ చేంజర్” లో కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ నుంచి దిగుమతి అయిన ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఇందటి క్రేజ్ ఉన్న ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే సినిమాలో కలిసి నటిస్తే కచ్చితంగా చాలా పెద్ద విషయం. ఇప్పుడు తమిళ స్టార్ హీరో శింబు త్వరలో నటించబోతున్న సినిమాలో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు నటించబోతున్నారు.
పాన్ ఇండియా గా శింబు సినిమా!
ఇక శింబు (Silambarasan) హీరోగా తెరకెక్కబోయే కొత్త సినిమా కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతుండగా, దేశింగు పెరియాస్వామి దర్శకత్వంలో శింబు హీరోగా ఈ సినిమా రూపొందబోతుంది. తమిళ సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో శింబు ద్విపాత్రాభినయం చేయనున్నాడు. అలా శింబు రెండు పాత్రల్లో కనిపించబోతున్న నేపథ్యంలో ఆయనకు జోడీగా ఇద్దరు ముద్దుగుమ్మలు నటించబోతున్నారు. ఇద్దరు హీరోయిన్స్ కూడా బాలీవుడ్ నుంచి తీసుకు రావడం వల్ల పాన్ ఇండియా రేంజ్ లో సినిమాని తెరకెక్కిస్తున్నారట. ఇది ఖచ్చితంగా బిగ్ సర్ప్రైజింగ్ అప్డేట్ అనడంలో సందేహం లేదు అంటున్నాయి తమిళ ఫిల్మ్ వర్గాలు. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఇదే నిజమైతే కోలీవుడ్ లోనూ ఈ భామలు పాగా వేయడం ఖాయంలా ఉంది.