కేజీఎఫ్ – 2 స్టోరీ ఇదే ఫిక్స్..?

కేజీఎఫ్ చాప్ట‌ర్ – 1 తో ప్రాంతీయ సినిమా స్థాయి పెంచిన ప్ర‌శాంత్ నీల్.. ఇప్పుడు కేజీఎఫ్ చాప్ట‌ర్ – 2తో ఏప్రిల్ 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఏ మాత్రం అంచ‌నాలు లేకుండా.. వ‌చ్చిన కేజీఎఫ్ – 1 సంచ‌ల‌నాల సృష్టించింది. అదిరిపోయే స్టోరీతో ప్రేక్షకుల‌కు సూప‌ర్ థ్రిల్ ను ఇచ్చింది. భార‌తదేశం మొత్తం క‌న్న‌డ చిత్ర సీమ వైపు చూసేలా చేసింది. కాగ రేపు విడుద‌ల కాబోయే.. కేజీఎఫ్ చాప్టర్ – 2 కూడా రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయం. అయితే విశ్వ‌స‌నీయ వ‌ర్గాల నుంచి వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం.. కేజీఎఫ్ చాప్ట‌ర్ – 2 స్టోరీ ఇదే అని తెలుస్తుంది.

కేజీఎఫ్ – 1 లో రాకీ భాయ్.. గోల్డ్ మైన్ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడు. దీంతో ఆధీర త‌న సామ్రాజ్యాని తిరిగి త‌న ఆధీనంలోకి తీసుకోవ‌డానికి వ్యూహాల‌ను ర‌చిస్తాడు. అయితే ఇక్క‌డే అస‌లైన ట్వీస్ట్ సినిమా య‌ష్ త‌ల్లి పాత్ర శాంత‌మ్మ.. ఆధీర కుటుంబానికి ద‌గ్గ‌ర బంధువులు. ఈ విషయం రాకీ భాయ్.. కేజీఎఫ్ కు వెళ్లాకా.. త‌న త‌ల్లి వెన‌క ఉన్న రాహాస్యం తెలుసుకుంటాడు.

రాకీ భాయ్.. తన తల్లికి ఫ్లాష్ బ్యాక్ లో జ‌రిగిన ద్రోహానికి ప‌గ తీర్చుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తాడు. అందుకోసం రాకీ భాయ్.. ఎలాగైనా ఆధీరను చంపాల‌ని చూస్తాడు. అధీర‌, రాకీ భాయ్ ఫ్యామిలీ వార్ జ‌రుగుతుంది. ఇప్ప‌టికే కేజీఎఫ్ పై క‌న్ను వేసిన ప్ర‌ధాని ర‌మికా సేన్.. రాకీ భాయ్ శ‌త్రువు అధీర‌తో చేతులు క‌లుపుతుంది. అధీర, ప్ర‌ధాని ర‌మికా సేన్.. రాకీ పై యుద్ధం ప్ర‌క‌టిస్తారు. ఈ యుద్ధంలో రాకీ భాయ్ ప్రాణాల‌కు తెగించి పోరాటం చేస్తాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు