Keerthi Suresh :కీర్తి సురేష్- పరశురామ్ మరోసారి..!

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇటీవల విడుదలై పర్వాలేదనిపించింది. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ మూవీ రూ.100 కోట్లకి పైగా షేర్ ను వసూల్ చేసి ట్రేడ్ కు సైతం షాకిచ్చింది. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో కీర్తి తొలిసారి బబ్లీ గర్ల్ గా కనిపించింది.

ఈమెలో గ్లామర్ యాంగిల్ కూడా ఉందని ప్రూవ్ చేసిన మూవీ ఇది. దీంతో మరోసారి కీర్తి సురేష్ ను తన సినిమాలో హీరోయిన్ గా పెట్టుకోబోతున్నాడట పరశురామ్. వివరాల్లోకి వెళితే.. నాగ చైతన్య హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ’14 రీల్స్ ప్లస్’ వారి నిర్మాణంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ‘నాగేశ్వర రావు’ అనే టైటిల్ ను అనుకుంటున్నారు.

ఈ మూవీలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను అనుకుంటున్నాడట పరశురామ్. ఆమె ఈ ప్రాజెక్టుకి దాదాపు ఫైనల్ అయిపోయినట్టే అని వినికిడి. ఇందులో నాగ చైతన్య ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపిస్తాడని.. కీర్తి సురేష్ అతనికి బాస్ గా కనిపించబోతుందని వినికిడి. గోపి సుందర్ లేదా తమన్ ఇద్దరిలో ఒకరు ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు