Krish Jagarlamoodi : క్రిష్ తో మళ్ళీ కలవనున్న మెగా హీరో?

Krish Jagarlamoodi : టాలీవుడ్ లో విభిన్న కథలతో, కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకులని అలరించే దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడి ఒకరు. నటనకు స్కోప్ ఉన్న కథా ప్రాధ్యాన్యం ఉన్న సినిమాలు ఎక్కువగా తీసే ఈ దర్శకుడు గత కొంత కాలంగా ఫామ్ లో లేడు. ఇక ఈ దర్శకుడు పవన్ కళ్యాణ్ తో మూడేళ్ళ క్రితం హరిహరవీరమల్లు సినిమా స్టార్ట్ చేశారు. అయితే ఈ సినిమా ఎంతకీ పూర్తి కాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ బాధ్యతల నుంచి తప్పుకొని ఫీమేల్ ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాన్ని అనుష్క తో స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరో వైపు నిర్మాతగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డితో కలిసి సినిమాలు చేస్తున్నాడు. ఇంతకు ముందు గౌతమి పుత్ర శాతకర్ణి వంటి సూపర్ హిట్ సినిమాలు చేసారు. ఇదిలా ఉండగా క్రిష్ త్వరలోనే ఓ మెగా హీరో తో సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అది దర్శకుడిగా కాదు నిర్మాతగా సినిమా తీయబోతున్నాడని టాక్.

Krish Jagarlamoodi Varun Tej Combo Again

వరుణ్ తేజ్ తో క్రిష్ సినిమా?

అయితే లేటెస్ట్ గా వస్తున్న వార్తల ప్రకారం క్రిష్ నిర్మించబోయే కొత్త సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా పట్టాలు ఎక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. క్రిష్ (Krish Jagarlamoodi) దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఆల్రెడీ “కంచె” మూవీ చేశారు. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ కాకపోయిన విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుని డీసెంట్ సినిమా అనిపించుకుంది. ఇక ఈ సారి ప్రొడ్యూసర్ గా వరుణ్ తేజ్ చిత్రాన్ని క్రిష్ నిర్మించబోతున్నారని సమాచారం. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కంప్లీట్ కామిక్ బేస్డ్ కథాంశంతో ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ లాక్ చేసారట. త్వరలో మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలవుతుందని సమాచారం. వచ్చే ఏడాది ఆరంభంలో మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందట. ఈ లోపు వరుణ్ తేజ్ మిగతా సెట్స్ పై ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తాడని సమాచారం.

- Advertisement -

వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే…

వరుణ్ తేజ్ చివరిగా ఆపరేషన్ వాలంటైన్ మూవీతో ప్రేక్షకుల ముందుకి రాగా, ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక కరుణ్ కుమార్ దర్శకత్వంలో “మట్కా” అనే సినిమాని ఎనౌన్స్ చేసి సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాడు. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ జోనర్ లో మాస్ యాక్షన్ మూవీగా ఆ చిత్రం తెరకెక్కనుంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అయితే బడ్జెట్ కారణంగా సినిమా కొంతకాలం ఆగింది. మళ్ళీ సమస్యలు అన్ని పరిష్కరించుకొని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నారట. వచ్చే వారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూట్ స్టార్ట్ కాబోతోందని టాక్ వినిపిస్తోంది. మట్కా రిలీజ్ తర్వాత క్రిష్ నిర్మాణంలో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేయబోయే సినిమాని వరుణ్ తేజ్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరో వైపు క్రిష్ అనుష్కతో చేస్తోన్న ఫీమేల్ సెంట్రిక్ మూవీ షూటింగ్ వీలైనంత వేగంగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ప్రారంభంలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. త్వరలోనే వరుణ్ తేజ్ క్రిష్ సినిమాపై అధికారిక ప్రకటన రానుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు