Gunturu karam: మాటల మాంత్రికుడిపై ఆగ్రహంలో మహేష్ అభిమానులు

సూపర్ స్టార్ మహేష్ బాబు తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ “గుంటూరు కారం” అనే సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ లోను ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా 2023 దసరా కి వస్తుందని త్రివిక్రమ్ మూవీ స్టార్ట్ చేసినపుడు అన్నాడు. తర్వాత షూటింగ్ జాప్యం వల్ల 2024 సంక్రాంతి కి షిఫ్ట్ అయ్యింది. అది ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినపుడు తెలిపారు.

అయితే రీసెంట్ గా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డే మూవీ నుండి తప్పుకోవడంతో రిలీజ్ డేట్ కంఫ్యూజింగ్ లో పడ్డారు అభిమానులు. సంక్రాంతికి ఈ సినిమా ఖచ్చితంగా వస్తుందా లేదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పైగా గుంటూరు కారం సినిమా షూటింగ్ ఇంకా 50శాతం కూడా పూర్తవ్వలేదు అని సమాచారం. అటు ట్రేడ్ వర్గాల్లో కూడా షూటింగ్ జాప్యం వల్ల రిలీజ్ డేట్ పై క్లారిటీ గా లేరు.

అయితే తాజాగా అల్లు అర్జున్ తో సినిమా అనౌన్స్ మెంట్ తో మహేష్ అభిమానులు త్రివిక్రమ్ పై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పెండింగ్ లో ఉన్న గుంటూరు కారం సినిమాని పట్టించుకోకుండా అల్లు అర్జున్ తో సినిమా అనౌన్స్ చేస్తున్నావేంటి అని సోషల్ మీడియా లో త్రివిక్రమ్ ను దున్నెతిపోస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. దానికితోడు గుంటూరు కారం టీజర్ కి కూడా సరైన రెస్పాన్స్ రాలేదు. థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఫ్యాన్స్ కి ఎక్కలేదు. మరి ఇదంతా పట్టించుకోకుండా త్రివిక్రమ్ తన నెక్స్ట్ సినిమాపై ఇప్పుడే చర్చలు పెట్టడం మహేష్ అభిమానులకు నచ్చడం లేదు.

- Advertisement -

మరి ఈ విషయం త్రివిక్రమ్ వరకు వెళ్లాలని సోషల్ మీడియా లో మహేష్ ఫ్యాన్స్ ఆయన్ని టాగ్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. ఎలాగూ అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ అయ్యేంత వరకు వేరే ప్రాజెక్ట్ ముట్టుకోడు. మరి త్రివిక్రమ్ ఇకనైనా తేరుకొని గుంటూరు కారం సినిమాని పూర్తి చెయ్యాలని మహేష్ అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా అంటున్నాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు