టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా వస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ వరుసగా స్టార్ హీరోలను దింపుతున్నాడు. ఈ స్టోరీని మెగా స్టార్ చిరంజీవి కోసమే రెడీ చేయగా.. అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను గెస్ట్ రోల్ గా తీసుకున్నాడు. చివరికి రామ్ చరణ్ 25 నిముషాల పాత్ర అయినా.. దాన్ని కీలకంగా మార్చి కథలో పలు మార్పులు చేశాడు కొరటాల. తాజా గా కొరటాల శివ మరో స్టార్ హీరోను ఆచార్య కోసం రంగంలోకి దింపుతున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో గత కొద్ది రోజుల నుంచి వార్తలు రాగ.. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి దీని ఫైనల్ చేస్తూ ట్వీట్ చేశాడు.
ఆచార్య సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు భాగం అవుతున్నాడని మెగా స్టార్ అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఆచార్య సినిమా ప్రారంభ సమయంలో పాదఘట్టం పరిచయం చేసే క్రమంలో సూపర్ స్టార్ వాయిస్ ఓవర్ ఉంటుందట. దీంతో ఆచార్య సినిమా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీలో ఉన్నారు. ఇప్పటికే మెగా స్టార్, మెగా పవర్ స్టార్ ఈ సినిమాలో ఉండటంతో భారీ అంచనాలు పెరిగాయి. తాజా గా సూపర్ స్టార్ మహేష్ బాబు కు కూడా గాత్ర దానంతో ఎంట్రీ ఇస్తుండటం ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది.
మెగా ఫ్యామిలీకి సూపర్ స్టార్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇది కొత్తేమీ కాదు. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా మూవీకి మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ సినిమాలో పవర్ స్టార్ ను పరిచయం చేసే సీన్ లో ఈ స్టార్ వాయిస్ వస్తుంది. అలాగే ప్రిన్స్.. ఎన్టీఆర్ బాద్ షా సినిమాకూ గాత్ర దానం చేశాడు. ఇప్పుడు సూపర్ స్టార్ ఆచార్య కోసం వస్తున్నాడు. కాగ ఆచార్య కు మహేష్ బాబు వాయిస్ ఓవర్ కలిసొచ్చే అంశమే అని చెప్పవచ్చు.