SSMB27: మహేష్ బాబు ‘సర్కారు వారి పాట” దర్శకుడిపై మండిపడుతున్న ఫ్యాన్స్..!

గీత గోవిందం ఫేమ్ పరశురాం దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం “సర్కారు వారి పాట“. మహేష్ బాబు కెరీర్ లో ఇది 27వ చిత్రం. 2022 మే 12వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు.

బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ విషయం తెలిసిన మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా దర్శకుడు పరశురాం పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇందుకు కారణం ఏంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్ కోసం మొదట అనుకునది కీర్తి సురేష్ కాదట. కీర్తి సురేష్ కంటే ముందు ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ ని ఎంచుకున్నారట దర్శకుడు. కానీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయిందట పాయల్.

ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ నటన సినిమాకి ఎంతో ప్లస్ అయిన విషయం తెలిసిందే. అయితే ఒకవేళ ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ని హీరోయిన్ గా తీసుకొని ఉంటే సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యి ఉండేదని.. కీర్తి సురేష్ ని తీసుకొని మంచి పని చేశారంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్లు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు