Chiranjeevi: థింకింగ్ మార్చుకున్న మెగాస్టార్..!

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ యువ హీరోలకు సైతం పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఖైదీ నంబర్ 150 సినిమా మొదలుకొని ప్రతి సినిమా విషయంలో సేఫ్ గేమ్ ఆడుతూ వస్తున్నాడు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల రిజల్ట్ తో ఆలోచనా తీరు మార్చుకున్న చిరు డైరెక్టర్ బాబీతో వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది గానీ, రొటీన్ మాస్ మసాలా స్టోరీ కావటంతో చిరు ఇక మారడా అన్న కామెంట్స్ వచ్చాయి. ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేష్ డైరెక్షన్లో నటిస్తున్న భోళాశంకర్ సినిమా కూడా రొటీన్ మసాలా సినిమాకి రీమేక్ కావటం, ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కూడా ఇంప్రెసివ్ గా లేకపోవటం వల్ల చిరుపై విమర్శలు ఎక్కువయ్యాయి.

ఇదిలా ఉండగా, భోళాశంకర్ సినిమా తర్వాత చిరంజీవి చేయబోయే ప్రాజెక్ట్స్ రొటీన్ కి బిన్నంగా ఉంటాయని సమాచారం అందుతోంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో చిరు మిడిల్ ఏజ్ క్యారెక్టర్లో కామెడీ టైమింగ్ తో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక మరో యువ దర్శకుడు వశిష్ట డైరెక్షన్లో చేయబోయే సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి తరహాలో సోషియో ఫాంటసీ జానర్లో ఉండనుందని అంటున్నారు.

మొత్తానికి రీఎంట్రీ ఇచ్చిన నాటి నుండి తాము మిస్ అవుతున్న వింటేజ్ చిరంజీవి రాబోయే సినిమాల్లో కనిపించబోతున్నాడు అన్న ఆనందం వ్యక్తం మెగా ఫ్యాన్స్. కాగా, కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించగా, తమన్నా చిరు సరసన హీరోయిన్ గా నటించిన భోళాశంకర్ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కి సిద్ధమవుతోంది.ఆలస్యంగా అయినా అభిమానుల కోరిక ప్రకారం ట్రాక్ మార్చిన చిరంజీవి, తదుపరి సినిమాల ద్వారా ఏ మేరకు అలరిస్తాడో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు