Mirzapur 3 Cast Remuneration : మీర్జాపూర్-3కి కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకున్న ఆ ఇద్దరు స్టార్స్ ఎవరో తెలుసా?

Mirzapur 3 Cast Remuneration : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మీర్జాపూర్ సీజన్ 3 ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ సీజన్ ఎలా ఉంది ? అన్న సంగతిని పక్కన పెడితే, ఇందులో నటించిన ఇద్దరు స్టార్స్ మాత్రం కోట్లలో రెమ్యునేషన్ తీసుకున్నారు అన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఆ ఇద్దరు స్టార్స్ కు షాకింగ్ రెమ్యూనరేషన్

సమాచారం ప్రకారం ఈ సిరీస్ లో ఇద్దరు స్టార్స్ మాత్రం భారీ రెమ్యూనరేషన్ ను తన ఖాతాలో వేసుకున్నట్టు సమాచారం. ఇందులో నటించిన కొంతమంది నటీనటుల పారితోషికం గురించి సమాచారం బయటకు వచ్చింది. నటి రసిక దుగ్గల్ ఈ సిరీస్‌లో బీనా త్రిపాఠి పాత్రలో నటించింది. ఇందులో ఒక్కో ఎపిసోడ్‌కు 2 లక్షల రూపాయల రెమ్యునరేషన్‌ను అందుకుంది. అంటే 10 ఎపిసోడ్లకు గాను ఈ నటి రూ.20 లక్షల రెమ్యునరేషన్ అందుకుంది. మీర్జాపూర్ 3 సిరీస్‌లో గుడ్డు పండిట్ పాత్రలో కనిపించిన నటుడు అలీ ఫజల్ ఒక్కో ఎపిసోడ్‌కు రూ.12 లక్షలు తీసుకున్నాడట. అంటే 10 ఎపిసోడ్‌లకు రూ.1,20,00,000 రెమ్యునరేషన్ అందుకున్నాడు. అలాగే ఇందులో జితేంద్ర కుమార్ అతిథి పాత్రలో కనిపించారు. ఆయన రెమ్యునరేషన్‌గా రూ.4 లక్షల కంటే ఎక్కువే తీసుకున్నాడని సమాచారం. మీడియా కథనాల ప్రకారం ‘మీర్జాపూర్ 2’ కోసం ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి 2 నుండి 10 కోట్ల రూపాయలు అందుకున్నట్టు టాక్ నడుస్తోంది. సీజన్ 3కి ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే సమాచారం మాత్రం బయటకు రాలేదు. గోలి పాత్రలో నటించిన నటి శ్వేతా త్రిపాఠి ఒక ఎపిసోడ్ కోసం రూ.2.20 లక్షలు అందుకుంది. అంటే 10 ఎపిసోడ్లకు గాను శ్వేత 22 లక్షల రూపాయలు అందుకుంది.

Mirzapur 3: Before third season, how did Mirzapur 2 end? - India Today

- Advertisement -

మీర్జాపూర్ సీజన్ 3కి ఊహించని రెస్పాన్స్

‘మీర్జాపూర్ సీజన్ 3’ జూలై 5న ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ‘మీర్జాపూర్’ సిరీస్‌లోని మొదటి రెండు సీజన్‌లను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇప్పుడు ఈ సిరీస్‌లోని మూడో సీజన్‌కు మాత్రం ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు కాలీన్ భయ్యాని అభినందిస్తున్నారు. మరికొందరు మున్నా భయ్యాని గుర్తు చేసుకుంటూ సిరీస్‌ను ఇష్టపడట్లేదు. మూడవ సీజన్‌ చెత్తలా ఉంది అంటున్నారు ప్రేక్షకులు. ‘మీర్జాపూర్ సీజన్ 3’ ప్రారంభంలో మున్నా భయ్యా మరణించినట్లు చూపించారు. మున్నా భయ్యా మృతి చెందడం చూసి అభిమానులు షాక్ అయ్యారు. సీజన్‌ మొత్తంలో కాలీన్ భయ్యా జస్ట్ షోపీస్‌లా ఉన్నాడని ప్రేక్షకులు అంటున్నారు. ఈ సీజన్‌లోని ఏడవ ఎపిసోడ్ పై దారుణంగా విమర్శలు విన్పిస్తున్నాయి.

మీర్జాపూర్ సీజన్ 3 స్టోరీ ఏంటంటే?

మున్నా భయ్యా ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఇక కాలిన్ భయ్యా కోమాలో ఉన్నాడు. మరోవైపు గుడ్డు భయ్యా మీర్జాపూర్ సింహాసనంపై కూర్చున్నాడు. అయితే పూర్వాంచ‌ల్ సింహాసన అధిపతి ఎవ‌ర‌నే దానిపై ఇంకా ఫైట్ కొన‌సాగుతూనే ఉంది. శరద్ శుక్లా కూడా పూర్వాంచల్ సింహాసనాన్ని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే రాజకీయాలలో భిన్నమైన గేమ్ ను నడిపించారు. పండిట్ జీపై ఎస్ఎస్పి మరణం కేసు కొనసాగుతోంది. అదే సమయంలో డింపీ, రాబిన్ ప్రేమ కథ కూడా ముందుకు సాగుతుంది. అయితే సింహాసనంపై ఎవరు కూర్చుంటారు? కాలిన్ భయ్యా ఏమవుతారో తెలుసుకోవాలంటే మీర్జాపూర్ సీజన్ 3 చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు