RC16 : కనీవినీ ఎరగని రేంజ్ లో విలేజ్ సెట్.. బుచ్చిబాబు ఎక్కడా తగ్గడం లేదు!

RC16 : టాలీవుడ్ లో తెరకెక్కబోయే మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రాల్లో RC16 కూడా ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఎలాంటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఎప్పుడో మొదలు కావాల్సిన ఈ సినిమా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వల్ల ఆలస్యమవుతూ వస్తుంది. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ నటిస్తున్న “గేమ్‌ ఛేంజర్‌” సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. అక్టోబర్‌ లో ఆ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా స్వయంగా దిల్‌ రాజు కుమార్తె రీసెంట్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని బట్టి ఇండియన్2 విడుదల కాగానే జులై లేదా ఆగస్టు రెండో వారం కల్లా గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చు అని సమాచారం. ఇక RC16 సినిమాని మాత్రం జూన్ నెలలో ఎలాగైనా మొదలు పెట్టాలని బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.

Mythri Movie Makers is building a huge village set for RC16 movie

RC16 లో కళ్ళు చెదిరే విలేజ్ సెట్…

ఇక గేమ్‌ ఛేంజర్‌ సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం, వెంటనే దర్శకుడు బుచ్చి బాబు సినిమా మొదలు అవ్వబోతుంది. బుచ్చిబాబు రామ్ చరణ్ సినిమా లాస్ట్ ఇయర్ లోనే ఓపెనింగ్ జరుపుకుకోగా, మెగాస్టార్ చిరంజీవి, అలాగే స్టార్ డైరెక్టర్లు, టెక్నిషియన్లు అతిథులుగా గ్రాండ్ గా ఓపెనింగ్ కూడా జరుపుకోవడం జరిగింది. ఇక RC16 కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది. అయితే తాజాగా చరణ్‌ – బుచ్చిబాబు మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ఎక్కువ శాతం సన్నివేశాలు పల్లెటూరు నేపథ్యంలో ఉంటాయట. అందుకోసం భారీ విలేజ్ సెట్‌ నిర్మాణం జరుగుతోందని సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సిటీ కి మధ్యలో, అది కూడా చరణ్‌ నివాసం ఉంటున్న ఇంటికి కొద్ది దూరంలో విశాలమైన ప్రదేశంలో విలేజ్ సెట్ ని దర్శకుడు బుచ్చిబాబు ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్ తో కలిసి నిర్మిస్తున్నాడట.

- Advertisement -

భారీ బడ్జెట్ తో సినిమా సెట్స్..

ఇక బుచ్చిబాబు సినిమాలో మెజార్టీ సన్నివేశాలు మరియు పాటలు కూడా విలేజ్ లోనే షూట్‌ చేస్తారు. కనుక ఎక్కువ ఖర్చు చేసి చాలా డిటైలింగ్‌ తో సెట్‌ ను క్రియేట్‌ చేస్తున్నారని సమాచారం అందుతోంది. ఆ మధ్యన రంగస్థలం విలేజ్ సెట్ సినిమాకి ఎంత ఉపయోగపడిందో తెలిసిందే. ఇక ఈ సినిమాలో అంతకు మించి భారీ బడ్జెట్ తో బుచ్చిబాబు విలేజ్ సెట్ వేయిస్తున్నాడట. మైత్రి మూవీ మేకర్స్‌ వారు ఈ సినిమాను సుకుమార్‌ తో కలిసి నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటించబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది దసరా లేదా దీపావళి సీజన్‌ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇక స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంతో రూపొందబోతున్న ఈ సినిమా పై అంచనాలు ఇప్పటి నుంచే భారీగా ఉన్నాయి. కాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడని తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు