Nagarjuna:బిగ్ బాస్ కు గుడ్ బై?

తెలుగులో మోస్ట్ సక్సెస్ఫుల్ రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. ఐదు సీజన్స్ తో తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ అంతులేని వినోదాన్ని పంచింది. ఇప్పుడు ఆరవ సీజన్ మొదలై చివరి దశకు కూడా చేరుకుంది. తెలుగులో తొలిసారి ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ షో మొదలైంది. అప్పటివరకు తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ షో అంటే తెలియదు. మొదటి సీజన్ లోనే ఎన్టీఆర్ తనదైన శైలితో రక్తి కట్టించాడు. ఆ తర్వాత హీరో నాని రెండవ సీజన్ లో హోస్ట్ గా వ్యవహరించారు. ఇక మూడవ సీజన్ కి అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. మూడో సీజన్ నుంచి బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున ఆరో సీజన్ కి కూడా ఆ పాత్రలో కనిపించారు.

అయితే ఆదరణ కోల్పోతున్న బిగ్ బాస్ కు కింగ్ నాగార్జున గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. అన్ని సీజన్లో కంటే ఈ సీజన్ లాంచింగ్ ఎపిసోడ్ కు అతి తక్కువగా 8.5 టిఆర్పి వచ్చింది. ఇది చూసి నాగ్ అప్సెట్ అయ్యారట. అలాగే ఈ సీజన్లో చాలావరకు అన్ ఫెయిర్ ఎలిమినేషన్స్ జరిగాయి అంటూ నేటిజెన్లు నెట్టింట మండిపడ్డ విషయం తెలిసిందే. దీనిపై కూడా నాగార్జున సీరియస్ అయ్యారని, ఇకమీద బిగ్ బాస్ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరించబోనని తేల్చి చెప్పారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు నెక్స్ట్ సీజన్ కి రౌడీ హీరో విజయ్ దేవరకొండ హోస్ట్ గా రానున్నరన్న ప్రచారము జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు