Namrata Shirodkar: 20 ఏళ్ల తర్వాత ఆ పని చేయనున్న నమ్రత !

Namrata Shirodkar: ఒకప్పటి టాలీవుడ్‌ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆమె తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి అక్కడ తిరుగులేని గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత వంశీ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా తీసే సమయంలోనే మహేష్ బాబుతో ప్రేమలో పడింది ఈ బ్యూటీ.

అనంతరం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇక వివాహ అనంతరం నమ్రత సినిమాల్లో నటించలేదు. ఈ జంట టాలీవుడ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక వివాహ అనంతరం నమ్రత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండి తన కుటుంబానికి తన పూర్తి సమయానికి కేటాయించింది. ప్రస్తుతం నమ్రత ఇద్దరు పిల్లలకు తల్లిగా వారి పూర్తి బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటుంది.

ఇదిలా ఉండగా ….నమ్రత 2004 సంవత్సరంలో వెండితెరపై కనిపించింది. ఆ తర్వాత ఎప్పుడూ కూడా సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు నమ్రత సినిమాల్లో మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ వాటిని నమ్రత ఖండించింది. ఇక రీసెంట్ గా మళ్లీ నమ్రత సినిమాల్లో నటించబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

- Advertisement -
Namrata Shirodkar re entry
Namrata Shirodkar

ఈ బ్యూటీ మళ్ళీ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వనుందట. ఓ స్టార్ హీరో నటించే సినిమాలో ఆమె కనిపించనుందని అంటున్నారు. ఈ సినిమాలో ఎవ్వరు ఊహించని విధంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నమ్రత నటించబోతుందట. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు