Nandamuri Mokshagna : ఏ పరిశ్రమలోనైనా వారసత్వం అనేది ఉంటుంది. కాకపోతే ఫిలిం ఇండస్ట్రీ చాలామందికి కనిపిస్తుంది కాబట్టి ఎక్కువ క్యూరియాసిటీ ఇండస్ట్రీ పీపుల్ పైన ఉంటుంది. ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదుగుతున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), అక్కినేని నాగార్జున(Akkineni Nagrjuna), విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ఈ సీనియర్ హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీరిలో వెంకటేష్, బాలకృష్ణ మినహాయిస్తే మిగతా హీరోలు కొడుకులు కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేసారు. ఇక మెగాస్టార్ తనయుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకొని నేడు గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.
చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చరణ్ తన రెండవ సినిమా మగధీర(Magadheera)తోనే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ను సాధించాడు. అక్కడితోనే స్టార్ గా ఎదిగాడు. వెంటనే బాలీవుడ్ లో సినిమా కూడా చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం చరణ్ స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చరణ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే టైంలోనే నాగర్జున తనయుడు నాగచైతన్య(Naga Chaitanya) కూడా జోష్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించుకోలేదు. ఆ తర్వాత గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో చేసిన ఏం మాయ చేసావే సినిమా నాగచైతన్యను హీరోగా నిలబెట్టింది. ప్రస్తుతం చైతన్య కూడా వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు.
ఇకపోతే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా సినిమా చేయనున్నాడు. ఈ సినిమా మైథాలజికల్ జోనెర్ లో ఉండబోతుంది. ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ను బేస్ చేసుకొని కథను సిద్ధం చేశాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాతోనే ఎంట్రీ ఇస్తున్నాడు మోక్షజ్ఞ. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ముహూర్తం అఫీషియల్ గా సెప్టెంబర్ 6న చేయనున్నారు అని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. దీనివలన ఈ సినిమా రేపు ఓపెన్ అవుతుందా లేదా అనేది ఇంకా తెలియదు. బాలకృష్ణ ఒక రాజకీయ నాయకుడు కాబట్టి, ప్రజల ఇబ్బందులు దృష్ట్యా ఇది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మొదటి సినిమాకి ఎన్ని అడ్డంకులు ఏర్పడుతున్నాయి అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.