Malli Pelli: నరేష్ మూడో భార్య కేసు – ‘మళ్లీ పెళ్లి’కి అడ్డంకులు..!

సీనియర్ హీరో నరేష్, పవిత్ర లోకేష్ లు జంటగా నరేష్ వైవాహిక జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా మళ్లీ పెళ్లి. నరేష్, పవిత్రాలు తమ రిలేషన్ ని అనౌన్స్ చేసిన నాటి నుండి తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఇక మళ్లీ పెళ్లి సినిమా అనౌన్స్ చేసిన నాటి నుండి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 26న విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్న నరేష్ కి తన మూడో భార్య షాక్ ఇచ్చింది. ఈ సినిమాలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సీన్లు చిత్రీకరించారని, సినిమా విడుదలను నిలిపేయాలని కోర్టును ఆశ్రయించింది రమ్య రఘుపతి. నరేష్, రమ్యలు విడిపోయినా ఇంకా అఫీషియల్ గా విడాకులు మంజూరు కావాల్సి ఉంది.

తనకు విడాకులు ఇవ్వకుండా ‘మళ్లీ పెళ్లి’ సినిమా పేరుతో నరేష్ పవిత్రలు కలిసి ఉండటం, సినిమా ప్రమోషన్స్ పేరుతో చట్టా పట్టాలేసుకొని తిరగటం చూసి సహించలేకనే రమ్య కోర్టుని ఆశ్రయించిందని టాక్ వినిపిస్తోంది. ఇలా సినిమా రిలీజ్ కి ఒకరోజు ఉండగా రమ్య కేసు వేయడం నరేష్ సహా సినిమా యూనిట్ కి కూడా గట్టి షాక్ అని చెప్పాలి. లేటు వయసులో నరేష్ పవిత్రలు అతి చేయటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని నెటిజన్లు అంటున్నారు.

సినిమా రిలీజ్ ఏర్పాట్లన్నీ పూర్తయ్యి ప్రమోషన్స్ పీక్ లెవెల్లో చేసిన ఈ సినిమాపై కేసు నమోదు కావటంతో సినిమా విడుదలపై సందిగ్దత నెలకొంది. సినిమా ద్వారా తమ రిలేషన్ ని జనాల్లోకి తీసుకెళ్లి జనాల ఆదరణ పొందాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నరేష్ పవిత్ర. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకోగా సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తి నెలకొంది ప్రేక్షకుల్లో. మరి, రమ్య రఘుపతి వేసిన కేసుకి స్పందించి కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు