Nayanathara : దూరం దూరం..

లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని వారు ఉండరు. చిన్న యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నయనతార ఇప్పుడు సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కెరీర్ ప్రారంభంలోనే గ్లామర్ పాత్రలతో మెరిసిన ఈ భామ, కుర్రకారును తన వైపునకు తిప్పుకుంది. కొన్ని రోజులకే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకున్న నయనతార, ఫుల్ స్వింగ్ లో సినిమాలు చేస్తూ వచ్చింది. కాగా ఈ స్టార్ హీరోయిన్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే.

విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడిన తర్వాత గ్లామరస్ పాత్రలను తగ్గించి కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేస్తూ వచ్చింది. ఈ లవ్ బర్డ్స్ 7 ఏళ్ల పాటు ప్రేమలో మునిగి తెలిన తర్వాత ఇటీవల పెళ్లి ఒక్కటి అయ్యారు. పెళ్లి తర్వాత నయనతార కెరీర్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఖాళీ సమయాన్ని భర్తతో ఉంటూనే సినిమాల్లోనూ బిజీగా రాణిస్తుంది ఈ అమ్మడు.

ప్రస్తుతం ఈ భామ తెలుగులో గాడ్ ఫాదర్, బాలీవుడ్ లో జవాన్, మలయాళంలో గోల్డ్, తమిళంలో మరో రెండు సినిమాల్లో నటిస్తుంది. ఈ క్రమంలో నయనతార షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు సైన్ చేసిన సినిమాలను వేగంగా పూర్తి చేయనుందట. వీటితో కొత్త సినిమాలకు దూరంగా ఉంటూ తన భర్త బ్యానర్ లో వచ్చే సినిమాలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకుందని సమాచారం అందుతుంది. అలాగే ఈ జంట చేస్తున్న వ్యాపారాలను కూడా చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -

ఈ నేపథ్యంలో సినిమాలకు గుడ్ బై చెప్పాలనే ఆలోచన నయనతారకు ఉందని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. నటనకు పూర్తిగా దూరంగా ఉంటూ నిర్మాతగా, వ్యాపారవేత్తగా బాధ్యతలను చూసుకోవాలని నిర్ణయం తీసుకుందని టాక్ వినిపిస్తుంది. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు