NBK 50Years Event.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి నందమూరి వారసుడిగా అడుగుపెట్టిన బాలకృష్ణ (Balakrishna) అరుదైన మైలురాయిని అధిగమించారు. వందేళ్ళ సినిమా చరిత్రలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఘనత ఒక బాలయ్యకే సొంతం . ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుగు అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. బాక్సాఫీస్ బొనాంజా గా పేరు ఉన్న ఈయనను తెలుగు సినిమా ఘనంగా సత్కరించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఈవెంట్ ను సెప్టెంబర్ 1వ తేదీన సాయంత్రం చాలా ఘనంగా ప్లాన్ చేసింది సినీ ఇండస్ట్రీ.
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం..
ముఖ్యంగా బాలకృష్ణ స్వర్ణోత్సవ ఉత్సవాలకు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. ఇక ఈవెంట్ ను హైటెక్స్ లో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో దక్షిణాదిలోని ప్రముఖ నటీనటులకు అలాగే ఉత్తరాది హీరో, హీరోయిన్లకు కూడా ఆహ్వానాలు అందినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ వేడుకకు భారీగా జనం కూడా తరలి వస్తారని అంచనాలు వేస్తున్నారు. ఒక్క సినీ సెలబ్రిటీలే కాదు రాజకీయ నేతలు కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి తదితరులతో పాటు ఆంధ్రప్రదేశ్ కి చెందిన సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు కూడా రాబోతున్నారు.
సినీ పెద్దలకు, రాజకీయ నాయకులకు ఆహ్వానం..
ఇకపోతే ఇప్పటికే మెగా హీరోలు అందరితో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కి కూడా ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపారు. స్వయంగా కలిసి ఈవెంట్ కి హాజరు కావాలని రిక్వెస్ట్ కూడా చేశారు. దీంతో మెగా హీరోలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కూడా బిజీ కార్యక్రమాలతో మునిగిపోయి ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి వస్తారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా మరొక విషయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది . తాజాగా పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు హాజరు కారు అంటూ ఒక వార్త వైరల్ అవుతోంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి మెగా సెలబ్రిటీలనే కాదు అల్లు సెలబ్రిటీలను కూడా ఆహ్వానించారు .అల్లు అరవింద్ అలాగే అల్లు అర్జున్ (Allu Arjun)ను స్వయంగా కలిసి ఆహ్వానించారు.
అల్లు అర్జున్ వల్లే బాలయ్య కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ రావట్లేదా..
అందుకే అల్లు అర్జున్ వస్తున్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ రావట్లేదు అంటూ వార్తలు ఇప్పుడు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల నుంచి అల్లు వర్సెస్ మెగా అన్నట్టుగా వార్తలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీల మధ్య కూడా ఈ వివాదం మనకు సోషల్ మీడియా ద్వారా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడంతో ఒకరికొకరు ఎదురుపడి పలకరించుకోకపోతే మరింత రూమర్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆలోచించారో లేక అల్లు అర్జున్ చేస్తున్న పనులు గిట్టక ఆయనను చూడడానికి కూడా ఇష్టపడడం లేదో తెలియదు కానీ మొత్తానికైతే బాలకృష్ణ 50 ఏళ్ల కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరు కావట్లేదని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.