Nidhhi Agerwal : సినిమాలకు గుడ్ బై ?

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య నటించిన  సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నిధి అగర్వాల్.  ఆ సినిమా ఆశించిన మేరకు ఫలితం రానప్పటికీ నిధి అగర్వాల్ కి మాత్రం అవకాశాలను అందిపుచ్చుకుంది. మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు లో నటిస్తోంది ఈ బ్యూటీ. 

ఇదిలా ఉండగా.. గత కొద్ది రోజుల నుంచి ఈ బ్యూటీ గురించి కోలీవుడ్ లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో నిధి అగర్వాల్ పెళ్లి జరుగనుందని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  నిధి అగర్వాల్, శింబుపై వచ్చే రూమర్స్ కి తమిళ హీరో ఉదయ నిధి స్టాలిన్ ఆజ్యం పోశాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం కలగ తలైవన్ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారు. 

తన స్పీచ్ లో నిధి అగర్వాల్ గురించి చెప్పుకొచ్చారు. నిధి అగర్వాల్ ఈ చిత్రంలో చాలా కష్టపడింది. “నా కంటే ఎక్కువగా ఈ సినిమాలో ఆమెకే ఎక్కువగా యాక్షన్ సీన్లు ఉన్నాయి. యాక్షన్ సీన్ల కోసం నిధి  ఎన్నో దెబ్బలను కూడా తిన్నదని, ఈ చిత్రం ఆమెకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ముందు ముందు నిధి అగర్వాల్ తమిళ చిత్రాల్లో నటిస్తుందో లేదో ” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు ఉదయ నిధి అలా ఎందుకు అన్నాడు? పెళ్లి అయిన తరువాత నిధి సినిమాలకు గుడ్ భై చెప్పనుందా అనే అనుమానంతో అభిమానులు ఆరా తీయడం ప్రారంభించడం విశేషం. 

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు