Niharika: మెగా హీరోలను కాదని అక్కినేని హీరో పై ఆశలు పెట్టుకున్న నిహారిక..?

Niharika.. వాస్తవానికి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉండే బడా ఫ్యామిలీల నుంచి హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టరు. పైగా ఆ కుటుంబాల నుంచి అమ్మాయిలు హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి రావడం చాలా అరుదు అనే చెప్పాలి. గతంలో ఘట్టమనేని కృష్ణ వారసురాలు ఘట్టమనేని మంజుల హీరోయిన్గా ఇండస్ట్రీలోకి వస్తానంటే ఘట్టమనేని కృష్ణ అభిమానులు యాక్సెప్ట్ చేయలేదు. మరొకవైపు మంచు ఫ్యామిలీ నుంచి మంచు లక్ష్మి కూడా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆమెను కూడా ప్రేక్షకులు ఆదరించలేదు. ఇప్పుడు మెగా డాటర్ నిహారిక కూడా హీరోయిన్ గా అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఆమెకు కూడా వర్కౌట్ అయిన దాఖలాలు కనిపించలేదు. ఇలా బడా కుటుంబాల నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయిలకు మాత్రం హీరోయిన్ గా సక్సెస్ లభించలేదు అనడంలో సందేహం లేదు.

Niharika: Niharika is hoping for Akkineni's hero and not mega heroes..?
Niharika: Niharika is hoping for Akkineni’s hero and not mega heroes..?

నిర్మాతగా మారిన నిహారిక..

ఇకపోతే నిహారిక పట్టు వీడని అమ్మాయి. తనకు నచ్చింది చేయడం కోసం ఎంతకైనా తెగిస్తుంది అనడంలో సందేహం లేదు. అందుకే ఇండస్ట్రీలో బలంగా పాతుకుపోవాలని నిర్ణయించుకున్న నిహారిక, హీరోయిన్ గా సక్సెస్ కాకపోతేనేం నిర్మాతగా సక్సెస్ అయి చూపిస్తానని చెబుతోంది. అందులో భాగంగానే తాజాగా ఈమె తన ప్రొడక్షన్ హౌస్ పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాను నిర్మించింది . ఆగస్టు 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పలు మీడియా ఛానల్స్ కు, యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ, సినిమాపై తెగ హైప్ క్రియేట్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

మెగా హీరోలను కాదని అలాంటి నిర్ణయం..

అందులో భాగంగానే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో జరగబోతోంది. అయితే ఇక్కడే అసలు విషయం అంతా.. మెగా కుటుంబంలో ఏకంగా గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్న నటులు ఉన్నారు. అయితే వారందరినీ ఈమె పక్కన పెట్టి ఇప్పుడు అక్కినేని వారసుడి వెంట పడుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి నిహారిక ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా తన సినిమాలు రిలీజ్ చేసి, మంచి ప్రమోషన్స్ అందించి, సినిమా హిట్ చేసుకోవాలని , సొంత టాలెంట్ తో ఎదగాలని ప్రయత్నం చేస్తోంది . అందులో భాగంగానే మెగా ఫ్యామిలీ పై ఈమె ఆధారపడకుండా సినిమా ప్రమోషన్స్ లో దూసుకుపోతోంది. ఇప్పుడు అక్కినేని హీరోని రంగంలోకి దించబోతోందట ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

అక్కినేని హీరో పై ఆశలు.

అందులో భాగంగానే త్వరలో జరగబోయే కమిటీ కుర్రోళ్ళు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అక్కినేని హీరో నాగ చైతన్య రాబోతున్నారని సమాచారం. దీంతో మెగా హీరోలు అంతమంది ఉండగా అక్కినేని హీరోనే ఎందుకు ఈ ప్రోగ్రాం కి రావడం? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. నిహారిక మాత్రం చాలా డిఫరెంట్గా ఆలోచిస్తూ చైతూ ని ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా ఆహ్వానించిందట. మరొకవైపు చైతు తండేల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. మరి నిహారిక కోరిక మేరకు ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా చైతూ వస్తారా? రారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే తమ ఫ్యామిలీ మెంబర్స్ ను కాదని అక్కినేని హీరోలను ఈవెంట్ కు పిలవడం వెనుక ఉన్న కారణం ఏంటో ఇంకా తెలియ రాలేదు. ప్రస్తుతం ఈ సందేహాలు మెగా అభిమానులను తలచి వేస్తున్నాయి. మరి దీనిపై నిహారిక ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు