SSMB28 : కొత్త రూమర్..

దాదాపు 12 సంవత్సరాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పుష్కరకాలం తర్వాత మహేష్, గురూజీ కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో మహేష్ అభిమానులంతా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అతడు, ఖలేజా సినిమాలకు భిన్నంగా ఈ మూవీ ఉండనుందని తెలుస్తోంది.  ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో జరిగాయి. అలాగే సినిమా రెగ్యూలర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఈ చిత్రాన్ని తక్కువ టైంలో కంప్లీట్ చేయాలని త్రివిక్రమ్ అనుకున్నాడు. కానీ, ఇటీవల మహేష్ మాతృమూర్తి ఇందిరా దేవీ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత మహేష్ విదేశాలకు వెళ్లాడు. దీంతో సినిమా షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడింది. తాజాగా సూపర్ స్టార్ విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. అతి త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.

అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ నోరా ఫతేహీతో ఓ స్పెషల్ సాంగ్ చేయించబోతున్నారట. అయితే ఇప్పటివరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అలాగే ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో మోహన్ లాల్ ని చూపించే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు టాక్ నడుస్తుంది. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు