Pawan Kalyan: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు పూర్తిస్థాయిలో సినిమాలు చేస్తుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇటు సినిమాలతో పాటు అటు రాజకీయాల్లో కూడా కీలక పాత్రను పోషిస్తున్నారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుసగా హిట్ సినిమాలు చేసి యూత్ లో తనకంటూ ఒక క్రేజ్ ను సంపాదించుకున్నారు. మామూలుగా ఏ హీరో కైనా కూడా ఒక సినిమా ఫెయిల్ అయితే మార్కెట్ కాస్త దెబ్బ తినడం ఫాన్స్ తగ్గడం లాంటివి జరుగుతాయి. కానీ అనూహ్యంగా పవన్ కళ్యాణ్ కి మాత్రం ఫ్యాన్స్ పెరగడంతో పాటు మార్కెట్ కూడా పెరిగింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014లో జనసేన అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలు విడిపోయిన టైం లో పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించారు. అయితే పార్టీని స్థాపించిన వెంటనే పోటీలో నిలబడకుండా చాలా సమస్యలపై ప్రజల తరఫున నిలబడి ప్రశ్నించారు. 2019లో పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో పోటీలో నిలబడ్డారు కానీ రెండు స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. అక్కడితో పవన్ కళ్యాణ్ ని చాలామంది విమర్శలు చేయడం మొదలుపెట్టారు. మొత్తానికి 2024వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ పార్టీ తరపున పోటీ చేసిన సభ్యులందరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు.
ఇకపోతే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో మూడు చేయాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయి. దాంట్లో హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇకపోతే హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడో పూర్తిగా కావాల్సింది, కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా పెండింగ్ లో పడుతూ వచ్చింది. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ప్రస్తుతం మళ్ళీ డేట్స్ కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 20 నుంచి 25 రోజులు వరకు ఈ సినిమాకి డేట్స్ ఇవ్వనున్నారు పవన్ కళ్యాణ్. ఇకపోతే ఈ సినిమాను ఆగస్టు కి పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టి డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే ఏ ఏం రత్నం కి మోక్షం కలిగినట్టే అని చెప్పొచ్చు.