Posani: నంది అవార్డులపై పోసాని సంచలన కామెంట్స్..!

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే నటుడు, రచయత పోసాని కృష్ణమురళి తాజాగా నంది అవార్డుల విషయంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇటీవల ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఛైర్మెన్ గా నియమితులైన పోసాని ఇవాళ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నంది అవార్డుల విషయంలో ప్రభుత్వాల పాత్రపై తీవ్ర విమర్శలు చేశారు. నంది అవార్డులను కమ్మ అవార్డులుగా మార్చేశారని అన్నారు. గతంలో టెంపర్ సినిమాకు గాను తనకు నంది అవార్డు అనౌన్స్ చేసారని, అది కులం చూసి ఇచ్చారు కాబట్టి ఆ అవార్డును తిరస్కరించానని చెప్పుకొచ్చారు.

పోసాని నంది అవార్డుల విషయంలో రచ్చకెక్కటం ఇది తొలిసారి కాదు, గతంలో కూడా ఒకసారి ఇలాగే తీవ్ర విమర్శలు చేసారు పోసాని. ఇప్పుడు ఏపీఎఫ్డీసీ ఛైర్మెన్ లాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా పోసాని ఇలాంటి వ్యాఖ్యలు చేయటం శోచనీయం. నంది అవార్డుల విషయంలో తరచూ ఇలాంటి విమర్శలు రావటం వల్లే ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఊసే మరిచిపోయాయి.

ఇక నంది అవార్డుల విషయంలో అంత బాధ వ్యక్తం చేస్తున్న పోసాని ఇప్పుడు కీలక పదవి ఉన్నారు కాబట్టి ఆ విషయమై ఏపీ సీఎం జగన్ తో మాట్లాడి తదనుగుణంగా ఏమైనా చర్యలు తీసుకుంటారేమో చూడాలి. ఇదిలా ఉండగా చిన్న చిన్న పదవుల కోసం పోసాని ఇలా దిగజారి కామెంట్స్ చేయటం వల్ల అటు తన పరువు, ఇటు సినీపరిశ్రమ పరువు తీసినట్టు అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు