Adipurush : మరో షాక్

ప్రభాస్ పేరు చెబుతే అభిమానుల్లో పునకాలు. ఆయన సినిమా వస్తుందంటే.. థియేటర్ ల వద్ద పండగ వాతావరణం. ఈయనతో సినిమాలు చేయాలని కేవలం టాలీవుడ్ డైరెక్టర్లే కాదు.. కోలీవుడ్, బాలీవుడ్ దర్శకులు కూడా క్యూ కడుతున్నారు. ప్రస్తుతం డార్లింగ్ కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో ఆదిపురుష్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆదిపురుష్ సినిమాపై రెబల్ స్టార్ భారీ స్తాయిలో అంచనాలు పెట్టుకున్నారు.

తమ అభిమాన హీరోను రాముడి పాత్రలో చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురూచూస్తున్నారు. కానీ ఈ ఆశలపై ఇప్పటికే నీళ్లు చల్లారు ఆదిపురుష్ టీం. ఇటీవల విడుదల చేసిన టీజర్ తో అభిమానులు ఆదిపురుష్ టీంపై పీకల్లోతు కోపంతో ఉన్నారు. చిన్న పిల్లలు చూసి కార్టూన్ మూవీలా ఉందని, బలహీనమైన వీఎఫ్ఎక్స్ ఉన్నాయని విమర్శలు వచ్చాయి. అలాగే ముందుగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పారు. కానీ దీన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆదిపురుష్ టీం పై అభిమానుల కోపం మరింత పెరిగింది. వాయిదా వేసినా వచ్చే ఏడాదిలోనే విడుదల చేస్తామని చెప్పినా విమర్శలు తప్పలేదు.

ఇప్పుడు తాజాగా ఆది పురుష్ మేకర్స్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. అదేంటంటే ? సినిమాను మరోసారి వాయిదా వేయాలని చూస్తున్నారట. అభిమానుల అంచనాలను అందుకోవడానికి వీఎఫ్ఎక్స్ వర్క్స్ మరింత ఉన్నంతగా చేస్తున్నారు. దీనికి చాలా సమయం పట్టేలా ఉందని టాక్. దీంతో వచ్చే ఏడాది కాకుండా, ఆపై వచ్చే ఏడాది సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంటే ఆదిపురుష్ 2024లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట.

- Advertisement -

ఈ వార్త తెలిసినప్పటి నుంచి డైరెక్టర్ ఓం రౌత్ పై, సినిమా నిర్మాణ సంస్థలపై డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడతున్నారు. తమ జీవితంలో ఆదిపురుష్ సినిమా చూస్తామా? అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు