Rakul – Jacky Wedding : రకుల్, జాకీల పెళ్లికి ఎవరెవరికి ఆహ్వానం అందిందంటే?

సెలబ్రిటీ కపుల్ రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీల పెళ్లి పనులు షురూ అయ్యాయి. 2024 ఫిబ్రవరి 21న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ముందుగా విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్న ఈ జంట తరువాత పెళ్లి వేదికను మార్చేశారు. గోవాలోని ఓ లగ్జరీ రిసార్ట్ లో పెళ్లి చేసుకోబోతున్నారు ఈ లవ్ బర్డ్స్. సౌత్ గోవాలోని ఐటిసి గ్రాండ్ హోటల్ లో రకుల్, జాకీల వివాహం వైభవంగా జరగబోతోంది. వీరి వివాహానికి కేవలం అతి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కాబోతున్నారు. ఇప్పటికే వీళ్ళ వెడ్డింగ్ కార్డ్ వైరల్ గా మారగా, రకుల్ పెళ్లికి హాజరు కాబోయే సెలబ్రిటీలు ఎవరెవరు అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. మరి ఇంతకూ సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీల్లో ఎంతమందికి రకుల్, జాకీల పెళ్లికి ఇన్విటేషన్ అందింది? అనే వివరాల్లోకి వెళ్తే…

రకుల్ పెళ్లికి హాజరు కాబోతున్న గెస్ట్ ల లిస్ట్ విషయంలో ముందుగా చెప్పుకోవాల్సింది ఆమె బెస్ట్ ఫ్రెండ్స్ గురించి. మంచు లక్ష్మి, హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ తమ స్నేహితురాలు రకుల్ పెళ్ళిలో మెరవబోతున్నారు. అలాగే బాలీవుడ్ నుండి అక్షయ్ కుమార్, ఈషా డియోల్, టైగర్ ష్రాఫ్, సోనం కపూర్, రితీష్ దేశ్ ముఖ్, షాహిద్ కపూర్, భూమి పెడ్నేకర్, ఆనంద్ అహుజా, వరుణ్ ధావన్ వంటి స్టార్స్ రకుల్ పెళ్ళిలో గెస్టులుగా సందడి చేయబోతున్నారు. వీళ్లతో పాటు టీవీ నటులు స్మృతి ఖన్నా, ఆమె భర్త గౌతం గుప్తాలకు కూడా రకుల్, జాకీల పెళ్లికి ఇన్విటేషన్ అందినట్టు సమాచారం. అయితే ఈ వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎవరెవరు హాజరు కాబోతున్నారు అన్న విషయంపై క్లారిటీ లేదు. వాస్తవానికి రకుల్ బాలీవుడ్ కంటే సౌత్ లోనే ఎక్కువగా సినిమాలు చేసింది. కానీ ఇప్పుడు ఆమె పెళ్లికి ఎక్కువగా బాలీవుడ్ స్టార్స్ మాత్రమే హాజరు అవుతుండడం గమనార్హం.

ఇదిలా ఉండగా రకుల్, జాకీ బీచ్ లో ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. అందుకే అతిథులు ఎవ్వరికీ ప్రింటెడ్ ఇన్విటేషన్లు పంపలేదు. ఇన్విటేషన్ల వ్యవహారం అంతా డిజిటల్ గానే జరిగినట్టు తెలుస్తోంది. సముద్ర తీరాన ప్రశాంతమైన వాతావరణంలో ఈ జంట పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికే తమ పెళ్లిలో పటాకులు కాల్చకూడదని ఈ జంట డిసైడ్ అయ్యారు. ఫిబ్రవరి 19 నుంచి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. పెళ్లికి కావలసిన అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. పెళ్లికి ముందు ఈ లవ్లీ కపుల్ ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లయిన తర్వాత ముంబైలోని ఎన్ఎంఏసిసి లో కొత్త దంపతులు రకుల్, జాకీ సెలబ్రిటీల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు