Simhadri: రీరిలీజ్ కి అంత ఖర్చా..?

టాలీవుడ్లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. తమ అభిమాన హీరోల పుట్టినరోజు వంటి సందర్భాన్ని పురస్కరించుకొని అప్పట్లో హిట్ అయిన సినిమాలు రీ రిలీజ్ చేసి సందడి చేస్తున్నారు అభిమానులు. ఇటీవల ఒక్కడు, జల్సా, వంటి సూపర్ హిట్ సినిమాలు రీరిలీజ్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టాయి. అప్పట్లో డిజాస్టర్ అయిన ఆరెంజ్ సినిమా రీరిలీజ్ చేస్తే 3కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ కెరీర్ తొలినాళ్లలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సింహాద్రి సినిమా కూడా మే 20న రీరిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ సినిమా రీమాస్టర్ కోసం సుమారు రెండు కోట్ల ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది.

ఇప్పటిదాకా రీరిలీజ్ అయిన సినిమాలకు ఈ రేంజ్ లో ఖర్చు చేయలేదనే చెప్పచ్చు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకి దారి తీస్తోంది, ఈ సినిమాకి అయ్యే ఖర్చుతో ఒక చిన్న సినిమా చేయచ్చని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ అవుతున్న ఈ ఇండస్ట్రీ హిట్ సినిమాకి అంత ఖర్చు పెట్టడం అవసరమా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా రీరిలీజ్ అయిన సినిమాల్లో 3కోట్ల కలెక్షన్లు రాబట్టి టాప్ ప్లేస్ లో ఉన్న ఆరెంజ్ సినిమానే టార్గెట్ గా సింహాద్రి సినిమాను రిలిజ్ చేస్తున్నట్టు స్పష్టం అవుతోంది.

అప్పట్లో బాక్సాఫీస్ వద్ద 25కోట్ల కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమాని రీ రిలీజ్ ద్వారా కూడా టాప్ ప్లేస్ లో చూసుకోవాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.RRR తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలు విడుదల కావాలంటే ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ గ్యాప్ లో సింహాద్రి సినిమా రీరిలీజ్ కానుండటం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కాస్త ఊరటనిస్తుంది. మరి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలతో రీరిలీజ్ చేస్తున్న సింహాద్రి ఏ రేంజ్ లో కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు