Ritu Verma: మొదటిసారి సందీప్ కిషన్ సరసన

Ritu Verma: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న తెలుగు హీరోయిన్స్ లో రీతు వర్మ ఒకరు. తెలుగు హీరోయిన్స్ కి అవకాశాలు లేవు చాలా తక్కువగా వస్తాయి అని అందరూ ఒక భ్రమలో ఉంటే, టాలెంట్ ఉంటే తెలుగు హీరోయిన్స్ ను మిగతా ఇండస్ట్రీ వాళ్ళు కూడా వెతుక్కుంటూ వస్తారు అని నిరూపించింది రీతు వర్మ. హైదరాబాద్లో పుట్టి పెరిగిన రీతు హైదరాబాద్లోనే చదువుకుంది. సినిమాల మీద ఇష్టంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఒక షార్ట్ ఫిలిమ్స్ లో నటించి అక్కడితోనే మంచి గుర్తింపు సాధించుకుంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన బాద్షా సినిమాలో పింకీ అనే పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో శ్రీ విష్ణు సరసన కనిపించింది.

తమిళ సినిమాల్లో కూడా హవా

ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించి తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పెళ్లిచూపులు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. పెళ్లిచూపులు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు ప్రీతి వర్మకి వచ్చాయి. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాలు వచ్చాయి ప్రస్తుతం ఈమె కెరియర్ లో మంచి సినిమాలు లైనప్ లో ఉన్నాయి. తెలుగులో రీతు చేసిన లాస్ట్ ఫిలిం ఒకే ఒక జీవితం. ఈ సినిమా శర్వానంద్ తో పాటు రీతూ వర్మ కూడా మంచి ప్లస్ అయింది.

Ritu Varma

- Advertisement -

సందీప్ కిషన్ సరసన

ప్రస్తుతం రీతు వర్మ సందీప్ కిసాన్ సరసన ఒక సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సందీప్ కిషన్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తన 30వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. అలానే దర్శకుడు త్రినాధ రావు నక్కిన ఇప్పటివరకు అన్ని మంచి హిట్ సినిమాలు తీశాడు. రవితేజ నటించిన ధమాకా సినిమాతో 100 కోట్ల మార్కెట్ కూడా కొల్లగొట్టాడు త్రినాధరావు. మరోవైపు సందీప్ కిషన్ కూడా ఊరు పేరు భైరవకోన అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో రావు రమేష్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు