పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ గత చిత్రం ఆదిపురుష్ నిరాశపరచడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ కి సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి వరుస డిజాస్టర్స్ వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది. సాలార్ టీజర్ ఇటీవలే విడుదలై సినిమాపై అంచనాలు పెంచిన క్రమంలో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్న జగపతిబాబు ఫ్యాన్స్ కి మరోసారి షాక్ ఇచ్చే న్యూస్ చెప్పాడు. గతంలో తాను 5రోజులు మాత్రమే షూటింగ్లో పాల్గొన్నానని చెప్పి బాంబు పేల్చిన జగపతి బాబు ఇప్పుడు కూడా అలంటి స్టేట్మెంట్ ఇచ్చాడు.
జగపతిబాబు సలార్ లో విలన్ అయినప్పటికీ ప్రభాస్ కాంబినేషన్లో ఒక్క సీన్ కూడా ఉండదని చెప్పాడు. తనకి ప్రభాస్ కి మధ్య సీన్లు పార్ట్2 లో మాత్రమే ఉంటాయని , పార్ట్1 లో ఉండవని చెప్పాడు జగపతి బాబు. ఇది ప్రశాంత్ నీల్ మార్క్ డైరెక్షన్ అని అంటున్నారు. టీజర్లో కూడా జగపతి బాబు ఒక్క షాట్ లో కూడా కనిపించలేదు కాబట్టి సాలార్ స్క్రీన్ ప్లే పై ఆసక్తి పెరుగుతోంది.
ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 28న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసింది సినిమా యూనిట్. వరుస ఫ్లాప్స్ పడినప్పటికీ ఆదిపురుష్ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చిన నేపథ్యంలో సలార్ కి బిజినెస్ హై రేంజ్ లో జరుగుతోంది. ఈ సినిమాకి కజిఎఫ్ తో లింక్స్ ఉన్నాయని టీజర్ తో స్పష్టం అవటంతో ప్రశాంత్ నీల్ యూనివర్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అన్న ఆసక్తి నార్మల్ ఆడియెన్స్ లో కూడా నెలకొంది. మరి, ఆదిపురుష్ లాంటి డిజాస్టర్ తర్వాత వస్తున్న సలార్ సినిమా ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ ఇస్తుందా లేదా చూడాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News