Mattu Vadalara 2: హేమా పై సెటైర్ వేసేశారు.. డైరెక్టర్ ఆన్సర్ వింటే నవ్వాగదు..

Mattu Vadalara 2: ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏం ఏం కీరవాణి ( MM keeravani ) చిన్న కొడుకు శ్రీ సింహా ( Sri Simha) హీరోగా పరిచయం అవుతూ వచ్చిన మూవీ మత్తు వదలరా.. ఆ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా భారీ హిట్ టాక్ ను అందుకుంది. యూత్ బాగా ఆ సినిమాకు కనెక్ట్ అయ్యారు. ఆ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు మరో సినిమా రాబోతుంది. మత్తు వదలరా 2 సినిమా అప్డేట్స్ ఒక్కొక్కటి మేకర్స్ వదులుతున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

దర్శకుడు రితేష్ రానా (Rithesh Rana) దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ కామెడీ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ను తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సీక్వెల్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘మత్తు వదలరా 2’ పేరుతో సీక్వెల్ తెరకెక్కుతోంది.. ఈ మూవీలో శ్రీ సింహ, సత్యలు ప్రధాన పాత్రలుగా మత్తు వదలరా 2ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఫరియా అబ్ధుల్లా హీరోయిన్. ఇటీవల మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన టీం తాజాగా టీజర్ రిలీజ్ చేసింది. కామెడీ, యాక్షన్తో టీజర్ బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యం వెన్నెల కిషోర్ సీరియస్ డైలాగ్స్ టీజర్కి హైలెట్గా నిలిచాయి. సత్య పెర్ఫార్మన్స్ కు ఫిదా అవ్వాల్సిందే.

Satire on Hema in Madhe Vadalara 2 Teaser..
Satire on Hema in Madhe Vadalara 2 Teaser..

గతంలో వచ్చిన సినిమాకు మించిన సన్నివేశాలు ఇందులో ఉన్నాయని తెలుస్తుంది. ఈ టీజర్ ఈవెంట్ లో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్న హైలెట్ గా నిలిచింది. ఈ టీజర్ లో ఓ సందర్బంలో డ్రగ్స్ కేసులో దొరికిన హేమా హేమీలు అనే డైలాగ్స్ పై ప్రశ్న అడిగాడు. ఆమె డ్రగ్స్ కేసులో దొరకలేదుగా ఇలా పెట్టారు అని అడగ్గా.. ఆ కేసు అవ్వక ముందే షూటింగ్ అయ్యిందని దాన్ని దాటవేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా దొంగతం, పోలీసు ఫోర్స్, గ్యాంబ్లింగ్ ఇలా ఆసక్తికర అంశాలతో టీజర్ను మలిచారు. సునీల్, సీనియర్ రోహిణిలో ప్రధాన పాత్రల్లో కనిపించారు.. ప్రస్తుతం టీజర్ అయితే ఆసక్తికరంగా ఉంది మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు