Sridevi: శ్రీదేవికి మూడో కూతురు ఉందా.. గుట్టు రట్టు..!

Sridevi.. తెలుగు, తమిళ్ ,హిందీ తో పాటూ ఇతర భాషలలో కూడా తన అందం తో, నటనతో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో అతిలోకసుందరి శ్రీదేవి కూడా ఒకరు.. శ్రీదేవి అటు హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో చిత్రాలను తెరకెక్కించింది. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో హఠాత్తుగా మరణించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. శ్రీదేవి మరణించి ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు అవుతున్నా.. ఆమె గురించి ఎన్నో విషయాలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. శ్రీదేవి… ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది.. వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా.. ఇందులో పెద్ద అమ్మాయి జాన్వీ కపూర్ అన్న సంగతి తెలిసిందే రెండవ అమ్మాయి ఖుషీ కపూర్.

Sridevi: Does Sridevi have a third daughter?
Sridevi: Does Sridevi have a third daughter?

శ్రీదేవికి మూడో కూతురు కూడా..

జాన్వీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఖుషీ కపూర్ మాత్రం హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. శ్రీదేవికి కేవలం ఇద్దరు కూతుర్లు మాత్రమే అని అందరూ అనుకుంటూ ఉంటారు.. కానీ శ్రీదేవికి ఇద్దరు కూతుర్లు కాకుండా మరొక కూతురు కూడా ఉన్నట్లు చాలామందికి తెలియకపోవచ్చు ఆమె ఎవరో కాదు సజల్.. శ్రీదేవి చివరిగా నటించిన మామ్ అనే చిత్రంలో ఈమె శ్రీదేవి కూతురుగా నటించిందట. ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య బంధం బాగా బలపడిందని.. దీంతో శ్రీదేవి ఆరోజు సజల్ తనకు మూడవ కూతురుతో సమానం అంటూ తెలియజేసిందట.

అసలు కథ ఇదే..

తనతో అంత బాండింగ్ తనకు ఏర్పడిందని.. అందుకు కారణం సజల్ తల్లి కూడా సినిమా షూటింగ్ సమయంలో మరణించడంతో తనని కూతురిగా శ్రీదేవి భావించినట్లు తెలుస్తోంది. అలా సజల్ తల్లి మరణించినప్పటికీ ..తన తల్లి రూపాన్ని శ్రీదేవిలో చూసుకునేదట సజల్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సజల్ మాట్లాడుతూ. శ్రీదేవి మరణం గురించి ఆమె చాలా ఎమోషనల్ గా మాట్లాడింది.. తన తల్లి మరణించాక శ్రీదేవిని తల్లిగా చూసుకున్నాను.. కానీ ఆ దేవుడు తన రెండవ అమ్మని కూడా దూరం చేశాడని బాధపడింది..

- Advertisement -

స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న జాన్వీ..

శ్రీదేవి ఎక్కడ ఉన్నప్పటికీ తనతో ఎప్పుడు ఫోన్లో మాట్లాడేది అంటూ తెలియజేసింది సజల్.. ఇలా తమ మధ్య ఉన్న బంధాన్ని సైతం బయటపెట్టింది.. అందుకే ఈమెనే శ్రీదేవి మూడో కూతురు అన్నట్లుగా ప్రచారం అయితే ఎక్కువగా వినిపిస్తోంది.. వాస్తవానికి జాన్వీ కపూర్, ఖుషి కపూర్ మాత్రమే శ్రీదేవి సొంత కూతుర్లు.. జాన్వీ ప్రస్తుతం అటు టాలీవుడ్ , బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. తన తల్లిలాగే అన్ని భాషలలో కూడా తన హవా చూపించాలనే విధంగా ప్లాన్ చేసుకొని మరీ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయిన ఈమె జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే రామ్ చరణ్ నటిస్తున్న RC -16 చిత్రంలో కూడా హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే తమిళ్ చిత్రాలలో కూడా ఈమె అవకాశం దక్కించుకోబోతుందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు