SS Rajamouli : మహేష్ కోసం హాలీవుడ్ ఆఫర్ ను వదులుకున్న జక్కన్న

SS Rajamouli : బాహుబలి తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పుకొనక్కర్లేదు. ఇక ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ కు ఆస్కార్ అవార్డును తెచ్చిన జక్కన్న నెక్స్ట్ మూవీ పైనే అందరి చూపూ ఉంది. అయితే తాజాగా ఈ స్టార్ డైరెక్టర్ మహేష్ బాబు కోసం హాలీవుడ్ ఆఫర్లను సైతం వదులుకున్నాడనే ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది.

హాలీవుడ్ ఛాన్స్ వదులుకున్న జక్కన్న

రాజమౌళి నెక్స్ట్ మూవీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆయన ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబుతో జక్కన్న నెక్స్ట్ మూవీ చేయబోతున్న విషయం తెలిసింది. SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని హాలీవుడ్ రేంజ్ లో రూపొందించబోతున్నట్టు డైరెక్టర్ రాజమౌళి ఇప్పటికే వెల్లడించారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ నిర్మాత కెఎల్ నారాయణ జక్కన్న గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు. రాజమౌళి మహేష్ బాబు కోసం హాలీవుడ్ ఆఫర్లను వదులుకున్నాడని వెల్లడించారు.

15 ఏళ్ల క్రితమే సెట్ చేసిన కాంబో…

స్టార్ ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ మాట్లాడుతూ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో 15 ఏళ్ల క్రితమే ఓ మూవీ ప్లాన్ చేశామని ఇంత వరకూ ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టారు. కానీ పలు కారణాల వల్ల అప్పుడు అది వర్కౌట్ కాలేదని, ఇన్నేళ్ల తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో SSMB29 అనే మూవీ రాబోతోందని వెల్లడించారు. అయితే రాజమౌళికి బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు తర్వాత హాలీవుడ్ నుంచి పిలుపు వచ్చిందని, కానీ ఆయన మాత్రం తమ ప్రాజెక్ట్ కే కమిట్ అయ్యాడని చెప్పుకొచ్చారు. మొత్తానికి హాలీవుడ్ అనగానే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతుంది అనే ఆలోచనతో అన్నీ పక్కన పెట్టేసి వెళ్లిపోకుండా తను కమిట్ అయిన సినిమాకే టైం కేటాయించడం జక్కన్న గొప్పదనం అంటున్నారు.

- Advertisement -

SSMB29 షూటింగ్ ఎప్పుడంటే?

ఇప్పటికే రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా నిర్మాత కెఎల్ నారాయణ SSMB29 మూవీ షూటింగ్ పై కూడా సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ దశలో ఉందని వెల్లడించిన ఆయన గత కొన్ని నెలలుగా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఆగస్టు లేదా సెప్టెంబర్ లో షూటింగ్ మొదలవుతుందని అన్నారు. సినిమా స్టోరీ అద్భుతంగా ఉందని, అయితే ఇంకా ఈ మూవీకి ఎంత బడ్జెట్ అనే విషయం డిసైడ్ అవ్వలేదని నిర్మాత పేర్కొన్నారు. కానీ సినిమాకు ఎంత అవసరమైనా సరే పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు కేఎల్ నారాయణ. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకు విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తుండగా, ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే నెలలో ఈ మూవీ లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు