SSMB 29 Update : మహేష్ సినిమాలో టాప్ తమిళ్ హీరో… ఆ రోల్ కోసమేనా?

SSMB 29 Update : మహేష్ బాబు, జక్కన్న కాంబోలో రాబోతున్న సినిమాకు సంబంధించి రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. నిన్నమొన్నటిదాకా ఓ మలయాళ సూపర్ స్టార్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడని రూమర్లు చక్కర్లు కొట్టాయి. తాజాగా మరో మల్టీటాలెంటెడ్ తమిళ హీరో ఈ సినిమాలో భాగం కాబోతున్నాడనే వార్త తెరపైకి వచ్చింది.

మహేష్ సినిమాలో టాప్ తమిళ్ హీరో

సూపర్ స్టార్ మహేష్ బాబు, దిగ్గజ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రానున్న భారీ చిత్రం సెట్స్ పైకి వెళ్ళకముందే సినీ ప్రేమికుల సహనాన్ని పరీక్షిస్తోంది. ఇది ఎప్పుడు మొదలవుతుందా అని మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ గ్లోబ్‌ట్రాటింగ్ అడ్వెంచర్ డ్రామా అంతర్జాతీయ స్థాయిలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా గురించి మహేష్ లేదా రాజమౌళి ఇప్పటిదాకా ఎటువంటి అప్‌డేట్‌లు ఇవ్వలేదు. కానీ కథ, నటీనటుల గురించి చాలా పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన వర్క్‌షాప్‌లు జరుగుతున్నట్లు సమాచారం. అలాగే మేకర్స్ ఒక్క మహేష్ ను తప్ప ఇంకా ఏ ఇతర నటుడిని అధికారికంగా ప్రకటించలేదు. మహేష్ బాబుని పక్కన పెడితే ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తారు ? అనే దానిపై క్లారిటీ లేదు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఇండోనేషియా బ్యూటీని హీరోయిన్‌గా తీసుకొస్తున్నారని, అయితే అది ఇంకా కన్ఫర్మ్ కాలేదని కొందరు అంటున్నారు. తాజాగా చియాన్‌ విక్రమ్‌ని ప్రత్యేక పాత్ర కోసం సంప్రదించినట్లు సమాచారం.

- Advertisement -

Chiyaan Vikram health scare: South superstar to attend Cobra audio launch on July 11 | Regional News | Zee News

ఆ పాత్ర కోసమేనా ?

తమిళ స్టార్ హీరో విక్రమ్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగడు అన్న విషయం తెలిసిందే. దేశంలోని ఉత్తమ నటులలో ఆయన కూడా ఒకరు. అయితే నిజానికి రాజమౌళితో పని చేయడానికి చాలా మంది స్టార్స్ ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు గనుక ప్రచారం అవుతున్న వార్తలు నిజమైతే విక్రమ్ ‘నో’ చెప్పే అవకాశం దాదాపు సున్నా. అయితే విక్రమ్ ను మేకర్స్ ఏ పాత్ర కోసం సంప్రదించారు అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అయితే కొంతమంది మాత్రం మహేష్ కు విలన్ గా తీసుకున్నారేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా మారతాయో వెయిట్ అండ్ సీ.

విలన్ గా మలయాళ హీరో

కాగా ఇప్పటికే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మహేష్ కు విలన్ గా నటించనున్నాడు అని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటిదాకా బయటకు వచ్చిన ఒక్క వార్తపై కూడా మేకర్స్ స్పందించకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా 2026లో సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టు టాక్ నడుస్తోంది. శ్రీ దుర్గా ఆర్ట్స్ మరో టాప్ బ్యానర్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. కానీ ఇంకా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలపై అఫిషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు