Tamannaah : తమన్నా ఆస్తులు తాకట్టు… లక్షలు పోసి ఆ ఆఫీస్ ను ఎందుకు అద్దెకు తీసుకుంటోంది?

Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తాజాగా తన ఆస్తులను తాకట్టు పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఆమెకు అంత కష్టం ఏమొచ్చిందో అని అనుకునేలోపే తాజాగా ఓ ఆఫీసును లక్షలు పోసి అద్దెకు తీసుకుందనే వార్త బయటకు వచ్చింది. మరి ఆ ఆస్తులను ఎందుకు తాకట్టు పెట్టింది? ఇక్కడ ఆఫీసును ఎందుకు అద్దెకు తీసుకుంది? అంటే..

లక్షలు పోసి 5 ఏళ్ళ లీజుకు..

ముంబైలో తన తాజా రియల్ ఎస్టేట్ వెంచర్‌తో తమన్నా తాజాగా వార్తల్లో నిలిచింది. నగరంలోని ప్రైమ్ ఏరియా జుహులో నెలకు ₹18 లక్షలకు కమర్షియల్ ప్రాపర్టీని అద్దెకు తీసుకుంది. జుహు తారా రోడ్‌లోని వెస్ట్రన్ విండ్ భవనంలో 6065 చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ ఉంది. తమన్నా నానావతి కన్‌స్ట్రక్షన్ నుండి గ్రౌండ్ ఫ్లోర్, బేస్‌మెంట్‌లోని యూనిట్లను ఐదు సంవత్సరాల కాలానికి లీజుకు తీసుకుంది. 2024 జూన్ 27న రిజిస్టర్ అయిన ఈ డీల్‌కు ₹72 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ కూడా చేసిందని తెలుస్తోంది.

ఒక్కో ఏడాదికి పెరిగే అద్దె

వెస్ట్రన్ విండ్‌లోని కమర్షియల్ ప్రాపర్టీని నెలకు ₹ 18 లక్షల అద్దెకు తీసుకున్న తమన్నా దాని కోసం ఐదేళ్ల పాటు రెంట్ కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ అద్దెకు సెపరేట్ గా అగ్రిమెంట్ చేసుకున్నారు. దాని ప్రకారం నాల్గవ సంవత్సరంలో అద్దె ₹ 20.16 లక్షలకు, ఆ తర్వాత ఐదవ సంవత్సరంలో ₹ 20.96 లక్షలకు పెరుగుతుంది. ఇది భవనం ప్రాంగణంలోని గ్రౌండ్ ఫ్లోర్ మరియు బేస్మెంట్లో యూనిట్లను కలిగి ఉంది, పత్రాలు చూపించాయి.

- Advertisement -

Fan asks Tamannaah Bhatia about her hidden talents, actress' reply will leave you in splits, South News | Zoom TV

ఆస్తులు తాకట్టు పెట్టేంత కష్టం ఏమొచ్చింది ?

ఇదిలా ఉండగా ఇటీవలే అంధేరీ వెస్ట్‌లోని మూడు రెసిడెన్షియల్ యూనిట్లను ₹ 7.84 కోట్లకు తమన్నా తనఖా పెట్టినట్లు రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ ప్లాట్‌ఫామ్ ప్రాప్‌స్టాక్ లో ఉన్న ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించాయి. సదరు అగ్రిమెంట్ లో ఉన్న వివరాల ప్రకారం ముంబైలోని అంధేరీ వెస్ట్‌లోని వీర దేశాయ్ రోడ్‌లోని నివాస భవనంలోని మూడు ఫ్లాట్‌లను ₹ 7.84 కోట్ల మొత్తానికి ఇండియన్ బ్యాంక్‌కు తనఖా పెట్టారు. ఈ డీల్ 2024 జూన్ 14న రిజిస్టర్ అయ్యింది. దీనికి ₹ 4.7 లక్షల స్టాంప్ డ్యూటీని కూడా కట్టినట్టు ఆ పత్రాల్లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. అయితే అసలు తమన్నా తీసుకున్న కమర్షియల్ ప్రాపర్టీ అంటే వ్యాపారం కోసం అనుకోవచ్చు. కానీ ఆమె ఎందుకు ఆస్తులు తాకట్టు పెట్టింది అనేదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

తెలుగులో ఒకే ఒక్క మూవీ

2022లో హిట్టయిన తెలుగు భాషా థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్‌ గా వస్తున్న ఓదెల 2 అనే మూవీలో నటిస్తోంది తమన్నా. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక్క తెలుగు మూవీ ఇదే. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉండగా, అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతోంది. సీక్వెల్‌లో తమన్నా ‘శివశక్తి’ అనే శక్తివంతమైన పాత్రను పోషిస్తుంది. ఇందులో తమన్నాతో పాటు హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్ తదితరులు నటిస్తున్నారు. రెండవ షెడ్యూల్ ప్రస్తుతం వారణాసిలో చిత్రీకరణ జరుపుకుంటోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు