సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సీతగా మారిపోయింది బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమా చేయక ముందు మృణాల్ ఠాకూర్ పరిస్థితే వేరే ఉండేది. ఎంత గ్లామర్ షో చేసినా, అవకాశాలు మాత్రం రాలేవు. కానీ, ఎప్పుడైతే, సీతారామంలో చీరకట్టులో మెరిసిందో అప్పటి నుంచి మృణాల్ ఠాకూర్ కు అవకాశాలు క్యూ కడుతున్నాయి. గ్లామర్ షో చేయకున్నా, అవకాశాలు వస్తున్నాయి. అయినా, ఈ అమ్మడు, తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఎప్పటికప్పుడు హాట్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ తన అభిమానులకు ట్రీట్ ఇస్తుంది.
అయితే సీతారామం తర్వాత మృణాల్ ఠాకూర్ కు తెలుగులోనే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలో మృణాల్ తెలుగు ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిందని, హైదరాబాద్ లో ఒక ఖరీదైన బిల్డింగ్ ను కూడా కొనుగోలు చేసిందని తెగ వార్తలు వచ్చాయి. మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు తెలుగులోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెటిజన్లు కూడా ఈ వార్తను నమ్మేశారు. సీతకు తెలుగు ఇండస్ట్రీనే బెటర్ ఆప్షన్ అంటూ కామెంట్స్ చేశారు.
అయితే తాజాగా ఈ వార్తలపై మృణాల్ ఠాకూర్ స్పందించింది. కాస్త సెటైరికల్ గా స్పందించి వార్తల్లో నిలిచింది. హైదరాబాద్ లో తాను కొనుగోలు చేసిన ఇంటి ఆడ్రస్ పెడితే, అక్కడే నివాసం ఉంటాను అంటూ ట్రోలర్స్ కు ఫన్నీగా కౌంటర్ ఇచ్చేంది. ప్రస్తుతం తాను హైదరాబాద్ లో ఎలాంటి ఇల్లు కొనుగోలు చేయలేదని క్లారిటీ ఇచ్చింది. అయితే తనకు నచ్చిన నగరాల్లో హైదరాబాద్ ఒకటి అని, త్వరలోనే ఇక్కడే ఇల్లు కొనుగోలు చేసి సెటిల్ అవుతానని చెప్పుకొచ్చింది. కాగా మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తెలుగులో నానితో NANI30లో హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment New