Tollywood Actor : కన్నడ ఇండస్ట్రీలో రోజుకో వార్త చక్కర్లు కొడుతుంది. మొన్నటివరకు హీరో దర్శన్ మర్డర్ కేసు ట్రెండ్ అవుతూ వచ్చింది. కానీ ఇప్పుడు రాజకీయ నాయకుల రాసలీలలు అని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి ఒకరు నందిబెట్ట ప్రాంతంలో వున్న అతిథి గృహంలో పలువురు యువతులతో ఎంజాయ్ చేస్తూ పార్టీలు నిర్వహించారని ప్రముఖ న్యాయవాది జగదీశ్ ( Jagadeesh ) ఆరోపణలు చేశారు. ఇప్పుడు తాజాగా ఈ ఆరోపణల పై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.
మాజీ ముఖ్యమంత్రి తీరుపై న్యాయవాది సుప్రీం కోర్టు ( Supreme Court ) ను ఆశ్రయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అని చెప్పారు తప్ప ఆయన పేరు మాత్రం చెప్పలేదు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినీ హీరోయిన్స్, యాక్టర్స్ తో పరిచయాలు ఉన్నట్లు చెప్పారు. ఆయన గెస్ట్ హౌస్ లో మంత్రితో కలిసి ఎంజాయ్ చేసేవారనికి ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇద్దరు మంత్రులతో కలసి నందిబెట్ట ప్రాంతలో వున్న గెస్ట్ హౌస్ కు వెళ్ళేవారట అప్పటిలో దీనిపై పెద్ద చర్చలే నడిచాయని వార్తలు వినిపించాయి.
అక్కడ పలువురు యువతులతో ముఖ్యమంత్రి , మంత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారని ఆరోపిస్తున్నారు. ఆ పార్టీలో ఉన్న గర్ల్స్ లో ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక సినీ నటి కూడా వున్నారని చెబుతున్నారు. ఆమెతో చాలా కాలం రిలేషన్ లో ఉన్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇన్నాళ్లకు ఈ విషయం పై వార్తలు మరోసారి గుప్పుమన్నాయి. మంత్రులకు ఇలాంటి సేవలు చేసిపెట్టడం ద్వారా కొంతమంది దళారులు తమ ఫైళ్ళ మీద సంతకాలు చేయించుకునేవారని లాయర్ జగదీశ్ ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక 20 మంది అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. కొద్ది రోజుల్లో ఆ నాయకులు, అధికారుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రితో నటి రాసలీలలు అనే విషయం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.