Thandel Postponed : తండేల్ పోస్ట్ పోన్… ఆ ఇద్దరు హీరోల వల్లే చై వెనకడుగు?

Thandel Postponed : అక్కినేని నాగచైతన్య అప్ కమింగ్ పాన్ ఇండియన్ మూవీ భారీ స్థాయిలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీని డిసెంబర్లో రిలీజ్ చేస్తామని మేకర్ ఇప్పటికే ప్రకటించారు. కానీ ఓ ఇద్దరు స్టార్ హీరోల కారణంగా నాగచైతన్య ఇప్పుడు వెనకడుగు వేయబోతున్నాడని తెలుస్తోంది. మరి తండ్రి మూవీ పోస్ట్ పోన్ కావడానికి కారణమైన ఆ ఇద్దరు హీరోలు ఎవరు? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.

తండేల్ పోస్ట్ పోన్ ?

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న కొత్త మూవీ తండేల్. ఈ మూవీలో నాగ చైతన్యకు జంటగా సాయి పల్లవి నటిస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న తండేల్ మూవీ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. దేశభక్తి, లవ్ అంశాలను కలగలిపి తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి చేపల వేటకు వెళ్లిన కొందరు జాలర్ల రియల్ లైఫ్ స్టోరీతో వస్తోంది. పాకిస్తాన్ జలాల్లోకి ఎంటర్ అయిన జాలర్లు అక్కడి పోలీసుల చేతికి చిక్కడం, అనంతరం వాళ్ళు చిత్రహింసలు భరించడం వంటి ఇంట్రెస్టింగ్ అంశాలతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు చందూ మొండేటి. ఈ సినిమాలో నాగ చైతన్యతో పాటు సాయి పల్లవి కూడా డి గ్లామర్ లుక్ లో కనిపించనున్నారు. అలాగే నాగ చైతన్య ఈ మూవీలో ఫస్ట్ టైం శ్రీకాకుళం యాసలో మాట్లాడబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ముందుగా తండేల్ మూవీని 2024 డిసెంబర్ 20న రిలీజ్ చేస్తామని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ తాజా పరిణామాలు చూస్తే ఈ మూవీ డిసెంబర్ లో రావడం అసాధ్యమేమో అనిపిస్తుంది. ఈ కారణంగానే నాగచైతన్య మూవీ రిలీజ్ మరింత ఆలస్యం కావచ్చునని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ఇక ఈ పుకార్లకు కారణం ఏమిటంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్, మంచు విష్ణు కన్నప్ప సినిమాలు డిసెంబర్లో రిలీజ్ కు రెడీ కావడమే. నితిన్ కూడా రాబిన్ హుడ్ మూవీతో డిసెంబర్ లోనే రావాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇన్ని సినిమాల మధ్య మూవీని రిలీజ్ చేయడం కంటే సోలోగా రిలీజ్ చేస్తే బెటర్ అని తండేల్ టీం భావిస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ మూవీని 2025 జనవరి లేదా ఫిబ్రవరిలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా టాక్ నడుస్తోంది. అయితే ఇంకా ఈ విషయం గురించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు.

- Advertisement -

What's Common Between Ram Charan And Vishnu Manchu - News18

నాగ చైతన్య తప్పు చేస్తున్నాడా?

ఒకవేళ ఈ వార్తలు గనక నిజమైతే నాగచైతన్య నిర్ణయం తప్పయ్యే అవకాశం ఉంది. తండేల్ మూవీపై ప్రకటించినప్పటి నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. అదీకాక ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు. మంచి కంటెంట్ బేస్డ్ మూవీ. దీనికి తోడు సాయి పల్లవి కూడా సినిమాకు బూస్ట్ లాంటిది. ఇప్పటికే తండేల్ మూవీ నుంచి రిలీజ్ చేసిన లుక్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక తండేల్ మూవీని డిసెంబర్ 20న రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఆల్మోస్ట్ క్రిస్మస్ టైం… కాబట్టి ఆ వీకెండ్ తో పాటు న్యూ ఇయర్ దాకా సినిమాకూ పాజిటివ్ టాక్ వస్తే చాలు కలెక్షన్ల వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రిలీజ్ డేట్ ని వదులుకుంటే కచ్చితంగా నాగచైతన్య తీసుకున్న నిర్ణయం తప్పే అవుతుంది అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. మరి తండేల్ మూవీ విషయంలో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు