రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతోనే దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా బాహుబలి సినిమాతో పాన్ ఇండియాగా స్టార్ మారాడు. ఇండియా నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు ప్రభాస్. బాహుబలి సినిమా తరువాత సాహో సినిమా తీసినప్పటికీ అది టాలీవుడ్లో విజయం సాధించకపోయినా, బాలీవుడ్ లో మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. సాహో తరువాత వచ్చిన రాధేశ్యామ్ సినిమా ప్రేక్షకులను అంతగా ఆక్టుకోకపోయినప్పటికీ ప్రభాస్ క్రేజ్ మాత్రం అలాగే కొనసాగుతోంది.
ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్, సలార్ సినిమాల్లో నటిస్తున్నారు. ఆదిపురుష్ సినిమా నుంచి ఇటీవలే దసరాకి టీజర్, ఫస్ట్లుక్ విడుదలైన విషయం తెలిసిందే. ఆదిపురుష్ సినిమా నుంచి విడుదలైన టీజర్ ని చూసిన అభిమానులు నెగిటివ్ కామెంట్లు చేశారు. అసలు ఆదిపురుష్ చిన్న పిల్లలు చూసే సినిమాలా ఉందని సోషల్ మీడియాలో తెగ చర్చించుకున్నారు. దీనిపై మేకర్స్ స్పందించి.. ఆదిపురుష్ ను మొబైల్స్ చూడటానికి కాదని.. ఇది పక్క 3డీ సినిమా అని వివరణ ఇచ్చారు. 3డీ టీజర్ ను కూడా ప్రదర్శించారు. దీని వల్ల డార్లింగ్ అభిమానులను కొంత వరకు తమ వైపునకు తిప్పుకున్నా, రెగ్యూలర్ సినీ లవర్స్ ను మాత్రం ఆకట్టుకోలేకపోయారు. దీంతో దీన్ని సరిదిద్దుకునే పనిలో పడ్డారు ఓం రౌత్ అండ్ టీం.
వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదల కావాల్సిన ఆదిపురుష్ సినిమా ఇప్పుడు వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ను రీ షూట్ చేయడంతో పాలు వీఎఫ్ఎక్స్ పనులను మరింత మెరుగ్గా చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. దీని వల్ల ఆదిపురుష్ ను వాయిదా వేసినట్టు టాలీవుడ్ వర్గాల్లో టాక్. వాస్తవానికి ఆదిపురుష్ ని వాయిదా వేయడానికి మరో కారణం కూడా ఉందని చెప్పొచ్చు. సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమాని విడుదల చేస్తే ఊహించిన మేరకు కలెక్షన్లు రావని భావించి, వాయిదా వేశారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద పోటీ ఎక్కువ లేని సమయంలో విడుదల చేస్తే కలెక్షన్లు కాస్త ఎక్కువగా వస్తాయని భావించి వాయిదా వేశారని మరి కొంత మంది కామెంట్ చేస్తున్నారు. మొత్తంగా ఎంతో కొంత మార్పుతో ఆదిపురుష్ థియేటర్ లోకి వస్తుంది అనే క్లారిటీ మాత్రం అభిమానులకు వస్తుంది.